ఒకప్పుడు ఎస్సీ రిజర్వ్ సీట్లలో టిడిపికి బలం ఉండేది..కొన్ని సీట్లు టిడిపికి కంచుకోటలుగా ఉండేవి..కానీ అక్కడ కొన్ని సామాజికవర్గాల సమీకరణాలు మారడం..ఎస్సీ నేతలకు అగ్రకులాల మద్ధతు తగ్గడంతో టిడిపి వరుసగా ఓడిపోతూ వస్తుంది. గత రెండు ఎన్నికల్లో రిజర్వ్ సీట్లలో వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఎస్సీలకు ఒరిగింది ఏమి లేదు. దీంతో వారిలో మార్పు కనిపిస్తోంది.
ఈ క్రమంలో పలు రిజర్వ్ సీట్లలో టిడిపి పుంజుకుంటుంది. ఇదే సమయంలో గూడూరు నియోజకవర్గంలో టిడిపి బలం పెరిగింది. వాస్తవానికి ఈ సీటులో టిడిపి గతంలో సత్తా చాటింది. 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో గెలిచింది. 2014లో కేవలం 9 వేల ఓట్ల తేడాతో ఓడింది. అప్పుడు వైసీపీ నుంచి గెలిచిన పాశం సునీల్ కుమార్ని టిడిపిలోకి తీసుకున్నారు. 2019లో టిడిపి నుంచి సునీల్..వైసీపీ నుంచి వరప్రసాద్ పోటీ చేశారు. జగన్ గాలిలో వరప్రసాద్ దాదాపు 45 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇంత మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే గూడూరుకు చేసిందేమి లేదు.
ప్రజలకు అందుబాటులో ఉండరు..అనేక అక్రమాలు కూడా చేశారని సొంత పార్టీ వాళ్లే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు. నెక్స్ట్ సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. దీంతో ఇక్కడ టిడిపికి అడ్వాంటేజ్ అయింది. టిడిపి ఇంచార్జ్ గా సునీల్ కుమార్ ఉన్నారు. అయితే ఈయన ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తే సత్తా చాటే ఛాన్స్ ఉంది.
వైసీపీపై వ్యతిరేకత మీద ఆధారపడకుండా సొంత బలం పెంచుకోవాలి..అప్పుడే గూడూరుని టిడిపి సొంతం చేసుకుంటుంది.
ReplyReply allForward |