చింతమనేని ప్రభాకర్..తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్ నాయకుడు. అలాగే ఈయన చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. కానీ అవన్నీ ప్రత్యర్ధులు క్రియేట్ చేసినవే. అయితే ఈయన పేద ప్రజలకు ఎలా అండగా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. అయినా సరే గత ఎన్నికల్లో ఈయనపై నెగిటివ్ ప్రచారం చేసి ఓడించారు. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి దెందులూరు బరిలో గెలిచిన ఈయన..2019 ఎన్నికల్లో ఓడిపోయారు.
ఈయనపై వైసీపీ నుంచి అబ్బయ్య చౌదరీ గెలిచారు. మరి ఇలా గెలిచిన అబ్బయ్య..దెందులూరుకు చేసేది ఏమైనా ఉందా? అంటే అక్కడ ప్రజల్లో అసంతృప్తి తప్ప..మరొకటి బయటకు రాదు. ఏదో ప్రభుత్వ పథకాలు ఒకటే అడ్వాంటేజ్. అలా అని పథకాలు అందిన వారు కూడా సంతృప్తిగా లేరు. ఎందుకంటే పన్నుల భారం ఎలా బాదుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇక అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉంది. చింతమనేని ఉన్నప్పుడే తాగునీరు, సిసి రోడ్ల నిర్మాణం, అండర్ డ్రైనేజ్లు..ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు.
ఇక చింతమనేని టార్గెట్ గా వైసీపీ ఎలాంటి రాజకీయం చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఆయనపై ఎన్ని కేసులు పెట్టారు..ఎన్ని సార్లు జైలుకు పంపారో తెలిసిందే. అలా చేయడమే చింతమనేనికి పెద్ద ప్లస్. దీంతో దెందులూరులో ఆయన లీడ్ లోకి వచ్చారు. సామాజికవర్గాల పరంగా చూస్తే..ఇక్కడ బిసి ఓటర్లు అధికంగా ఉంటారు. అలాగే ఎస్సీ-ఎస్టీ ఓటర్లు తర్వాత స్థానంలో ఉంటారు. కమ్మ-కాపు వర్గాల ప్రభావం ఉంది.
గత ఎన్నికల్లో మెజారిటీ బిసి-ఎస్సీ-ఎస్టీ ఓట్లు వైసీపీకి పడ్డాయి. అలాగే ఇద్దరు కమ్మ అభ్యర్ధులే దీంతో కమ్మ ఓట్లు చీలిపోయాయి. దీని వల్ల అబ్బయ్యకు ప్లస్ అయింది. ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. బిసిలు మెజారిటీ చింతమనేని వైపు ఉన్నారు. దళిత వర్గాల్లో మార్పు ఉంది. సగం ఓట్లు చింతమనేనికే..ఇక కమ్మ ఓట్లు 70 శాతం పైనే పడతాయి. దీంతో దెందులూరులో చింతమనేని గెలుపు పక్కా..