గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన జిల్లాల్లో విశాఖ కూడా ఒకటి. అయితే విశాఖ సిటీలో సత్తా చాటిన టిడిపి రూరల్ లో ఓడింది. సిటీలో నాలుగు సీట్లు ఉంటే..నాలుగు టిడిపి కైవసం చేసుకుంది. రూరల్ లో 11 సీట్లు ఉన్నాయి..కానీ 11 సీట్లలో టిడిపి ఓడింది.అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక సిటీపై కూడా పట్టు సాదించేలా ముందుకెళుతుంది. ముఖ్యంగా రాజధాని పేరుతో వైసీపీ చేసే రాజకీయం తెలిసిందే. కానీ వైసీపీ రాజకీయాన్ని విశాఖ ప్రజలు నమ్ముతున్నట్లు లేరు.
రాజధాని అని చెప్పిన సరే వైసీపీ వైపుకు రావడం లేదు. దీంతో విశాఖలో టిడిపి బలం పెరిగింది. సిటీలో మూడు సీట్లలో టిడిపి బలంగానే ఉంది. రూరల్ లో కూడా బలం పెంచుకుంది. అదే సమయంలో జనసేనతో పొత్తు టిడిపికి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. పొత్తు ఉంటే సిటీలో నాలుగు సీట్లు గెలిచేస్తారు. ఇక టిడిపి బలంగా ఉన్న రూరల్ సీట్లు..నర్సీపట్నం, పాయకరావుపేట, అనకాపల్లి, పెందుర్తి, గాజువాక, భీమిలి, ఎలమంచిలి సీట్లు..టిడిపి, జనసేన కలిస్తే ఈ సీట్లలో వైసీపీ గెలవడం గగనం.
అటు మాడుగుల, చోడవరం, అరకు, పాడేరు సీట్లలో టిడిపికి ఇంకా బలం పెరగాలి. ఆయా సీట్లలో వైసీపీకి పట్టు ఎక్కువ ఉంది. అయితే టిడిపి బలం పెరిగేలా విశాఖ నేతలు..బస్సు యాత్ర చేస్తున్నారు.టిడిపి మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళుతూనే..పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో విశాఖలో మంచి ఫలితాలే రాబట్టేలా ఉన్నారు.
టిడిపి జనసేన పొత్తులో ఉమ్మడి విశాఖలో ఖచ్చితంగా 10 సీట్లు గెలవడం ఖాయం..ఇంకా ఛాన్స్ ఉంటే ఒకటి, రెండు సీట్లు అదనంగా వచ్చే ఛాన్స్ ఉంది.