పాపం జగన్… ఇది చాలా చిన్న మాట అవుతుందేమో.. ఎందుకంటే, వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఏరి కోరి ఎంచుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… జగన్ పాలనపై, ఆయన విధానాలను తప్పు పడుతున్నారు. జగన్ చేస్తోంది తప్పని కామెంట్ చేస్తున్నారు. జగన్ సర్కార్ చేస్తోన్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై విరుచుకుపడుతున్నారు.. ఇది నిజమేనా అని గిల్లి మరీ చూసుకోవాల్సిన పనిలేదు.. అక్షరాలా నిజం..
ప్రశాంత్ కిశోర్.. ఏపీలో జగన్ భారీ విజయానికి మూలకర్త, సిద్ధాంత కర్తగా చెబుతారు.. జగన్కి గత ఎన్నికలలో 151 స్థానాలు రావడం వెనక మాస్టర్ మైండ్ ఆయనదే.. టీడీపీ మీద సోషల్ మీడియాలో విషం చిమ్మి, సామాజిక న్యాయం పేరుతో కులాల కుంపట్లు రాజేసి రాష్ట్రంలో చిచ్చు పెట్టి జగన్ని అధికారానికి చేరువ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం సంక్షేమంతోనే నెట్టుకువస్తున్నారు.. నాలుగన్నరేళ్లుగా రాజధాని అమరావతిని అటకెక్కించాడు.. పోలవరాన్ని ఇంచ్ ముందుకు కదలించకుండా పండుకోబెట్టాడు.. రోడ్లను గుల్ల చేశాడు.. ఏ రోడ్డు చూసినా గుంతలమయం.. ఇటు, ప్రత్యేక హోదాని ఏనాడో వదిలేశాడు..
గతంలో చంద్రబాబు సర్కార్ అందించిన అనేక ఉపాథి పథకాలను నిలిపివేశాడు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకానలు పేరు మార్చి బండి నడిపిస్తున్నాడు… అంతేతప్ప, జగన్ సర్కార్ అప్పులు చేయడం, బటన్ నొక్కడం మినహా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని కోలుకోలేని దెబ్బ తీశాడు.. ఈ నాలుగన్నరేళ్ల వ్యవధిలోనే ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేశాడని ఆర్ధిక వేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు..
సరిగ్గా వీటిపైనే జగన్… రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నోరువిప్పాడు.. జగన్ సర్కార్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు తప్పు అని ఆయన నెత్తి నోరు బాదుకొని మరీ చెబుతున్నారు.. సంపద సృష్టించి దానిని పది మందికి పంచిపెట్టాలి కానీ, ఉన్న వనరులను, ఆస్తులని అమ్ముకొని ప్రజలకు పంచి పెట్టడం తప్పు అని, అది సంక్షేమం అనిపించుకోదు అని ఓ చర్చా వేదికలో ఆయన అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పి మరీ, ఆ రాష్ట్రంలా చేయకూడదని వ్యాఖ్యానించడం జగన్ టీమ్కి పూర్తి ఇబ్బందిగా మారుతోంది.
మరోవైపు, పంచుతున్న వందల కోట్ల రూపాయలతో జగన్ సర్కార్పై గప్పాలు కొడుతున్నాయి నీలి, కూలి మీడియా.. జగన్ విదిలించే పైసల కోసం కక్కుర్తి పడుతూ రాష్ట్రం సర్వ నాశనం అవుతుంటే చలి కాచుకుంటున్నారు.. అలాంటి వారికి ప్రశాంత్ కిశోర్ సమాధానం.. చెప్పు తీసి కొట్టినట్లు ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి, దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి..