ఆంధ్రప్రదేశ్లో పొలికల్ మూడ్ షిఫ్ట్ అవుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వైపు గాలి మళ్లుతున్నట్టు అనేక సర్వేలు తేల్చి చెబుతున్నాయి. అధికార పార్టీ నేతల అడ్డగోలు దోపిడీ, అవకతవక విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారని స్పష్టం చేస్తున్నాయి. లేటెస్ట్గా జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్తో కలిసి నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 15కి పైగా లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని తేల్చారు, ఎన్నికల సర్వే సంస్థ సీ ఓటర్ విశ్లేషకులు. ఏడాది క్రితం ఇదే ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి కేవలం 7 లోక్సభ స్థానాలే వస్తాయని చెప్పారు. తాజా సర్వే ప్రకారం తెలుగుదేశం విజయం సాధించగల సీట్లు రెట్టించపయ్యాయి. దీన్ని బట్టి ప్రజలు రాష్ట్రంలో అధికార పార్టీకి గుడ్బై చెప్పి… టిడిపికి పట్టం కట్టడానికి సిధ్దంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది. ఎన్డీఏ మరోసారి 300లకు పైగా లోక్స్థానాల్లో విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వస్తుంది సర్వే ఫలితాలు చెబుతున్నాయి. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రాంతీయ పార్టీలతో కలసి ఏర్పాటైన ఇండియా కూటమి విజయానికి దగ్గర్లో కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఏపీలో జనసేన పార్టీ మాత్రమే అధికారికంగా ఎన్డీయేలో ఉంది. ఎన్నికల నాటికి, తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీయేతో కలిసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ కూటమిలో ఉన్న లేదా భవిష్యత్తులో ఎన్డీయేలో చేరే అవకాశం ఉన్నా పార్టీల్లో, తెలుగుదేశం పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలు సాధించనుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే నిర్వహించిన విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
జగన్ పాలనతో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి పోయిందని అత్యధిక ఓటర్లు అభిప్రాయ పడుతున్నారు. విజనరీ లీడర్, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారు. ఆ అభిప్రాయం రోజురోజుకీ బలపడుతుండటం వల్లనే రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ పెరుగుతోంది. టిడిపి ఒంటరిగా పోటీ చేస్తునే ఈ స్థాయి విజయం సాధించగలదని సర్వేలు చెబుతున్నాయంటే.. ఇక జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే… ఈ కూటమి సునామీ సృష్టించడం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు ఇండియా టుడే సర్వే ఫలితాలతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. విజయం మాదే అని పైకి గంభీరంగ మాట్లాడుతున్నా… అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఇదే సరళి కొనసాగితే టిడిపిలోకి వలసలు వెల్లువెత్తడం ఖాయం.