ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే టిడిపికి పెద్దగా పట్టు లేని జిల్లా అని చెప్పవచ్చు..ఇక్కడ వైసీపీ హవా ఎక్కువ ఉంది. గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీదే హవా. కానీ ఈ సారి వైసీపీకి చెక్ పెట్టి తన సొంత జిల్లాలో టిడిపిని గెలిపించాలని చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాలపై పట్టు పెరిగేలా పనిచేస్తున్నారు. అలాగే గతంలో టిడిపికి మంచి విజయాలు దక్కి.. తర్వాత దెబ్బతిన్న స్థానాలపై బాబు ఫోకస్ పెడుతున్నారు.
ఈ సారి అలాంటి స్థానాల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు టిడిపికి పట్టున్న శ్రీకాళహస్తి సీటుపై ఫోకస్ పెట్టారు. 1983 నుంచి ఇక్కడ టిడిపి హవా నడుస్తుంది. 1983, 1985, 1989, 1994, 1999, 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. అంటే కాళహస్తి టిడిపి కంచుకోట అని తెలిసిపోతుంది. అందులో నాలుగుసార్లు బొజ్జల గోపాల్ కృష్ణారెడ్డి గెలిచారు.
అయితే 2019లో బొజ్జల వారసుడు సుధీర్ టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలిచారు. ఇక ఈయనపై వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉంది. కాళహస్తిలో అభివృద్ధి పెద్దగా లేదు.ఇక మొదట సుధీర్ అనుకున్న మేర సరిగా పనిచేయలేదు. బాబు క్లాస్ ఇవ్వడంతో సుధీర్ దూకుడుగా పనిచేస్తున్నారు. టిడిపి బలం పెంచుతున్నారు.
ఇదే క్రమంలో తాజాగా కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు టిడిపిలోకి వచ్చారు. ఈయన రాకతో టిడిపికి కొత్త ఊపు వచ్చింది. వాస్తవానికి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 2004లో ఈయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు..2009లో ఓడిపోయారు. అయినా అప్పుడు కాంగ్రెస్కు అధికారం ఉంది.
అలా అలా కాంగ్రెస్ లో కొనసాగి చివరికి వైసీపీలోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాయుడుకు ఒరిగింది ఏమి లేదు. దీంతో ఇప్పుడు ఆయన టిడిపిలోకి వచ్చారు. దీంతో కాళహస్తిలో టిడిపికి కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ సారి అక్కడ టిడిపి గెలుపు సుధీర్, నాయుడు కలిసి పనిచేయనున్నారు. కాళహస్తిలో ఈ సారి టిడిపి జెండా ఎగిరేలా ఉంది.