వైసీపీ యువ నేతల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వారిలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా ఒకరు. తక్కువ కాలంలోనే ఈయన ఫాలోయింగ్ పెంచుకున్నారు. అలాగే వైసీపీలో కీలక పదవులు దక్కాయి. శాప్ ఛైర్మన్ పదవితో పాటు..పార్టీలో యువజన విభాగానికి అధ్యక్షుడు అయ్యారు. కానీ ఈయన అనుచరులు మాత్రం సీటు ఆశిస్తున్నారు. బైరెడ్డికి సీటు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారని అంటున్నారు.
అటు బైరెడ్డికి కూడా ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని ఆశ ఉందని తెలిసింది. కానీ సీటు దక్కడంపైనే చర్చ ఉంది. ఎలాగో ఆయన నందికొట్కూరు బాధ్యతలు చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో అక్కడ ఆర్థర్ ని ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే నందికొట్కూరు రిజర్వడ్ సీటు కావడం వల్ల..బైరెడ్డికి పోటీ చేసే అవకాశం లేదు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేరే సీటులో పోటీ చేయాలి. కానీ ఏ సీటు కూడా ఖాళీగా లేదు. అన్నీ సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బైరెడ్డికి సీటు దక్కే అంశంపై ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ సీటు ఇచ్చిన వైసీపీకి ఇబ్బందే అనే పరిస్తితి. ఎందుకంటే కర్నూలులో ఎక్కువ శాతం సీనియర్ ఎమ్మెల్యేలు. వారిని తప్పించడానికి జగన్ కు అవకాశం లేదు. ఒకవేళ తప్పించాలని చూస్తే వైసీపీకే ఇబ్బంది. ఏ ఎమ్మెల్యే సీటు కోల్పోయిన వారు వైసీపీ గెలుపుకు సహకరిస్తారనేది డౌట్.
అయితే బైరెడ్డి..కర్నూలు సిటీ లేదా పాణ్యం, శ్రీశైలం సీట్లలో ఏదొకటి ఆశిస్తున్నట్లు సమాచారం. ఇక పాణ్యం, శ్రీశైలంలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని సైడ్ పక్కన పెట్టడం జరిగే పని కాదు. మళ్ళీ వారికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇటు సిటీలో హఫీజ్ ఖాన్ ఉన్నారు..ఆయనకు పోటీగా ఎస్వీ మోహన్ రెడ్డి సీటు ఉన్నారు. దీంతో ఈ సీటు డౌటే. నంద్యాల ఎంపీ సీటు కూడా కష్టమే. చూడాలి మరి చివరికి బైరెడ్డికి సీటు దక్కుతుందో లేదో.