జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ వచ్చేసింది..ఆయన మళ్ళీ భీమవరం బరిలోనే దిగుతారని తేలిపోయింది. గత ఎన్నికల్లో ఎక్కడైతే ఓడిపోయారో..అక్కడ నుంచే పోటీ చేసి గెలవాలని పవన్ డిసైడ్ అయ్యారు. అందుకే గత మూడు రోజుల నుంచి ఆయన భీమవరంలోనే మకాం వేశారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరిలో నరసాపురంలో సభ ముగించుకుని..భీమవరంలో ఎంట్రీ ఇచ్చారు.
కానీ తర్వాత స్వల్పంగా అనారోగ్యం చేయడంతో భీమవరం సభకు బ్రేక్ ఇచ్చారు. అయితే భీమవడం వదిలిపెట్టలేదు..అక్కడే ఉంటూ పార్టీ బలోపేతంపై చర్చలు చేశారు. కీలక సమావేశాలు నిర్వహించారు. ఇక భీమవరంతో వారాహి మొదట విడత ముగింపు సభ జరగనుంది. ఈ సభ వేదికగా పవన్..భీమవరంలోనే పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే భీమవరంలో టిడిపి నుంచి కూడా లైన్ క్లియర్ అయింది..ఇక్కడ టిడిపి ఇంచార్జ్ గా తోట సీతారామలక్ష్మీ ఉన్నారు.
ఇక పవన్ పోటీ చేస్తారనే తెలిసి..చంద్రబాబు అక్కడ తాత్కాలికంగా ఇంచార్జ్ ని పెట్టారని తెలుస్తుంది. అయితే పవన్ ఇప్పటికే పోటీ చేసే సీట్లపై పెద్ద చర్చ జరిగింది. కానీ ఆయన మళ్ళీ భీమవరంలోనే బరిలో దిగుతారని తేలిపోయింది. ఇక టిడిపితో పొత్తు నేపథ్యంలో ఆయన భీమవరంలో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తెలుస్తుంది. పొత్తు లేకపోయినా ఈ సారి పవన్ గెలుపు ఆపడం కష్టమే అని చెప్పవచ్చు.
ఇక టిడిపి-జనసేన పొత్తు మాత్రం ఫిక్స్ అయిపోయింది. పొత్తు ఉంది కాబట్టి..ముందు వారాహి యాత్రలో పవన్ పాలకొల్లు టూర్ ఉంది. కానీ అక్కడ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నారు. దీంతో ఆ సీటు మళ్ళీ టిడిపికే కాబట్టి..పవన్ ఆ సీటులో పర్యటించకుండా డైరక్ట్ భీమవరం వచ్చేశారు. మొత్తానికి పవన్ ఈ సారి భీమవరం బరిలోనే దిగనున్నారు