టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అక్రమంగా అరెస్టు జైలుకు వెళ్లి 53 రోజులు అయింది.ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు హైకోర్టు అనారోగ్య కారణాల రీత్యా మద్యంతర బెయిలును ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడును ఏ పరిస్థితులలో చూడవలసి వస్తుందా అని టిడిపి నేతలు కార్యకర్తలు అంతా కంగారు పడుతుంటే, చంద్రబాబు నాయుడు మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో జైలు నుంచి బయటకు వచ్చి అందరికీ ఆనందాన్ని ఇచ్చారని చెప్పవచ్చు.
చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అధికార పార్టీని గానీ, అధినేత జగన్మోహన్ రెడ్డిని గాని,సిబిఐని గానీ ఎవరిని విమర్శించలేదు.కష్టకాలంలో తనకు అండగా నిలబడిన జనసేన అధినేత పవన్ కు, తనకు మద్దతుగా నిలిచిన నేతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.టిడిపి కార్యకర్తలు అందరూ ఈ నాలుగు వారాలు చంద్రబాబునాయుడు మాతో ఉంటే చాలు గెలవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఆయన చేస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో,ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉంటాడాలో ,ఎన్నికల వ్యూహాల రచన ఇవన్నీ సిద్ధం చేస్తారు అని టిడిపి నాయకులు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు.నాలుగు వారాల తర్వాత చంద్రబాబు నాయుడు జైలుకు వెళితే ఆయన ఇచ్చిన వ్యూహాలతో ఆయనను ముఖ్యమంత్రిని చేసి జైలు నుంచి బయటకు తీసుకొస్తామని ధీమాగా చెబుతున్నారు.ఒకవేళ న్యాయం గెలిచి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లకుండా ఆగిపోతే ఆయనకు తోడుగా ఉండి అఖండ మెజారిటీ సాధించి వైసీపీకి బుద్ధి చెబుతామని చెబుతున్నారు.
మరి టిడిపి నేతలు ఆశలు ఫలించి విజయం చేకూరుతుందా???