రోజా ఈ పేరు గురించి పరిచయం అక్కరలేదు.ఎప్పుడు వివాదాలలోనే ఉంటున్నారు.టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన రోజా వైసీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.ఈసారి మంత్రి పదవిని కూడా పొందారు.రోజాకు నియోజకవర్గం అభివృద్ధిలో కన్నా టిడిపి నేతలను,చంద్రబాబు నాయుడును విమర్శించడానికి ఎక్కువ శ్రద్ధ ఉందని ప్రతిపక్ష నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.
రోజా తను మాట్లాడాలనుకున్న మాటలను ఎటువంటి సంకోచం లేకుండా,ఎదుటి వారి భావాలతో సంబంధం లేకుండా మాట్లాడి ఎదుటివారిని బాధపెడుతున్నారు.కానీ తనదాకా వచ్చేసరికి అమ్మాయిని అనరాని మాటలు అంటున్నారని గగ్గోలు పెడుతున్నారు.టిడిపి నేత బండారు సత్యనారాయణ రోజా గురించి మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే రేపాయని చెప్పవచ్చు.ఒకానొక సమయంలో సత్యనారాయణ మాటలతో టిడిపి నేతలు అందరూ ఆలోచనలో పడ్డారని చెప్పవచ్చు.రోజా గురించి విమర్శించే వారిలో అయ్యన్నపాత్రుడు కూడా ఉన్నారు.ఇప్పుడు టిడిపి కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.అందుకోసం రాజకీయ అనుభవం ఉన్న ఒక మహిళ నేతను ఎంచుకున్నారు.ఆమె ఇప్పటి ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ.విద్యావంతురాలు,రాజకీయ అనుభవం కలిగిన ఈమె రోజా వాగ్దాటికి తాళం వేయగల సత్తా ఉన్న నేత అని టిడిపి నేతలు అందరూ భావించారు.వారి అంచనాలు నిజం చేస్తూ రోజా చేసి విమర్శలకు కౌంటర్ కి ప్రతి విమర్శ చేస్తూ అనురాధ దీటుగా సమాధానం చెబుతున్నారు. భువనేశ్వరి పాదయాత్ర గూర్చి రోజా చేసిన విమర్శలకు అనురాధ గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పవచ్చు.ఫ్యాషన్ షో కోసం ఎవరు రెడీ అవుతున్నారు ప్రజలందరికీ తెలుసు అంటే రోజాకు మరో మాట మాట్లాడే అవకాశం లేకుండా చేశారు.ఇలాగే కొనసాగితే రోజా మాట్లాడాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
టిడిపి వ్యూహం ఫలించి అనురాధ రోజాకు పెట్టగలుగుతుందా లేదా వేచి చూడాల్సిందే….