టిడిపి వైసిపి రెండు పార్టీలు రాబోయే ఎన్నికలలో కొన్ని నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.వాటిలో ఎంత ఖర్చు పెట్టైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.అలాంటి నియోజకవర్గాలలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ,గన్నవరం కూడా ఉన్నాయి.
గన్నవరం ఎమ్ఎల్ఎ గా ఇప్పటివరకు వల్లభనేని వంశీ ఉన్నారు.వంశీకి టిడిపి రాజకీయంగా ఎదగడానికి సహకరించింది.టిడిపి గుర్తుతోనే వంశీ తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారనేది జగమెరిగిన సత్యం.కానీ వంశీ ఒకే ఒక్క మాటతో టిడిపికి శాశ్వతంగా దూరమయ్యారు.శత్రువుగా మారిపోయారు. ఇప్పుడు వైసీపీలో చేరి గన్నవరంలో టిడిపికి బలం లేదు,వంశీకి మాత్రమే బలం ఉంది అని నిరూపించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
యార్లగడ్డ వెంకట్రావు ఇతను 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి వంశీ పై తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పొందారు.ఆ తర్వాత కేడీసీసీ చైర్మన్ అంటూ ఒక పదవిని ఆయనకు ఇచ్చి వంశీని వైసీపీలోకి ఆహ్వానించింది వైసిపి అధిష్టానం.వంశీ వైసీపీలో చేరతారని ఊహాగానాలు మొదలైనప్పటినుంచి యార్లగడ్డ వెంకట్రావుకు వైసీపీ నుంచి అవమానాలు ఎక్కువయ్యాయి.అతనిపై,అతని క్యాడర్ పై దాడులు,కేసులు ఎక్కువయ్యాయి.ఎవరికైనా ఓర్పు కొంతవరకే కదా వీటన్నింటినీ తట్టుకోలేని యార్లగడ్డ వైసిపికి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన యార్లగడ్డకు చంద్రబాబు సముచిత స్థానం ఇచ్చి నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు కూడా ఇచ్చారు.నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన యార్లగడ్డ లోకేష్ యువగళం పాదయాత్రను భారీగా సక్సెస్ చేశారని చెప్పవచ్చు.యువగళం పాదయాత్ర సక్సెస్ తో గన్నవరంలో వంశీ కి యార్లగడ్డ చెక్ పెట్టగలరని ధీమా టిడిపి నేతలకు కలగగా,వైసిపి నాయకులకు గుబులు మొదలైందని చెప్పవచ్చు. ఎంత ఖర్చు పెట్టి అయినా ఈసారి గెలవాలని వంశి యార్లగడ్డ ఇద్దరు ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నారు.కొన్ని నియోజకవర్గాలలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలకు డబ్బు ఇచ్చేటప్పుడు ఒక ఒప్పందానికి వచ్చి ఇద్దరూ ఇంచుమించు ఒకలానే డబ్బులు పంపిణీ చేస్తారు.కానీ గన్నవరం అందుకు మినహాయింపు ఎందుకంటే ఇక్కడ వల్లభనేని వంశీ క్యాడర్ కు,యార్లగడ్డ వెంకట్రావు క్యాడర్ కు మధ్య పూర్తిగా శత్రుత్వం ఉందని చెప్పవచ్చు. ఇక్కడ పార్టీల వారు ఇచ్చే డబ్బును ఎదురు పార్టీ వాళ్లు ఎవ్వరూ తీసుకోరని చెప్పవచ్చు.గతంలో వంశీ,యార్లగడ్డ పోటీ చేశారు.కానీ ఇప్పుడు అభ్యర్థులు వారిద్దరే కానీ వారు పోటీ చేసే పార్టీ గుర్తు మారింది.
టిడిపికి బలం లేదు,టిడిపి బలంతో తాను గెలవలేదు నా బలంతోనే టిడిపి గెలిపించాను అనే వంశీ వాదన నిజమవుతుందా??? లేక గన్నవరం టిడిపి అడ్డ అంటూ యార్లగడ్డకు విజయాన్ని అందిస్తారో??? గన్నవరం ప్రజల తీర్పు ఎలా ఉంటుందో లేచి చూడాల్సిందే