రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలు తాము గెలిచే స్థానాల గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు.వై నాట్ 175 అంటూ జగన్ చెబుతుంటే,అసలు ఈ 50 సీట్లు గెలిస్తే అప్పుడు చూద్దాం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అసలు ఆ 50 స్థానాలు ఏంటో?వాటిలో వైసిపి గెలవక పోవడానికి గల కారణాలేంటో చూద్దామా!!!!
175 సీట్లు గెలవడం అన్నది అసాధ్యం.ఆ విషయం గెలుస్తామని చెప్పే అధికార పార్టీకి తెలుసు,సామాన్య ప్రజలకు తెలుసు.ఇలాంటి తరుణంలో రాజకీయ విశ్లేషకులు 175 కాదు ఈ 50 స్థానాలలో వైసిపి ఓటమి తప్పదు అని అంటున్నారు.ప్రజలలో అధికార పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత,పార్టీ నాయకులపై ఉన్న వ్యతిరేకత ఇవన్నీ వైసీపీకి తలనొప్పిగా మారాయి.
కుప్పం,టెక్కలి,మంగళగిరి,గాజువాక,భీమవరం తాడికొండ,ఉండి,పాలకొల్లు,నరసాపురం,తణుకు, తాడేపల్లిగూడెం,ఏలూరు,విశాఖ ఈస్ట్,వెస్ట్,నార్త్ సౌత్,ఇచ్ఛాపురం,రాజమండ్రి సిటీ,రాజమండ్రి రూరల్,కాకినాడ సిటీ,కాకినాడ రూరల్,నర్సీపట్నం,పిఠాపురం,పెద్దాపురం, మండపేట,రాజోలు,రామచంద్రపురం,కొత్తపేట, గన్నవరం,పెడన,కైకలూరు,మచిలీపట్నం, విజయవాడ తూర్పు&పశ్చిమ,విజయవాడ సెంట్రల్,పెనమలూరు,జగ్గయ్యపేట,పొన్నూరు, తెనాలి,గుంటూరు,పరుచూరు,అద్దంకి,ఒంగోలు, నెల్లూరు సిటీ,తిరుపతి,నగరి,చిత్తూరు ఈ 50 నియోజకవర్గాలలో టిడిపి జనసేన పొత్తు నేపద్యంలో టిడిపిని కచ్చితంగా గెలుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.వీటిలో కొన్ని నియోజకవర్గాలు టిడిపికి కంచుకోట అయితే, కొన్ని జనసేన పొత్తుతో లాభం పొందేవి.ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత మొదలైనవన్నీ ఈ సారి టిడిపిని అధికారంలోకి తీసుకు వస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి ఏమవుతుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే….