వైసిపిపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈసారి గెలిచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ప్రజలకు తమ పార్టీ చాలా మంచి చేసిందని చెప్పడానికి రోజుకో కొత్త కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళుతుంది. ఈ కార్యక్రమాలతో ప్రజలు విసిగి వేసారి పోతున్నారని చెప్పవచ్చు. ఏ పథకమైనా, కార్యక్రమమైనా ఏది చేసినా ఖర్చు పెట్టేది ప్రజల డబ్బు కానీ దానిపైన ఉండేది మాత్రం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి బొమ్మ. నిద్ర లేచింది మొదలు ఎక్కడ చూసినా అంతా వైసిపి జెండాలు, వైసీపీ బొమ్మలతోనే కనిపిస్తున్నాయని ప్రజలందరూ విమర్శిస్తున్నారు.
అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవుగాని పబ్లిసిటీ కోసం ఎక్కడినుంచి వస్తున్నాయని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల కోసం ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు అదే సామాజిక సాధికార బస్సు యాత్ర. ఇది గ్రామస్థాయి మండల స్థాయి నాయకులు కాదండోయ్, ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా మంత్రులు నిర్వహిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వైసీపీ చాలా మేలు చేకూర్చిందని చెప్పటానికి ఈ యాత్రను ప్రారంభించారని చెబుతున్నారు.
నియోజకవర్గానికి చేసిన పావలా పనికి రూపాయి హడావిడి చేస్తుంటే ఎవరైనా వస్తారా?అలాగే ఈ సామాజిక సాధికార బస్సుయాత్ర సభలకు ప్రజలు దూరంగానే ఉంటున్నారు.ని యోజకవర్గాలలో వారిపై ఒకపక్క ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కటానికి ప్రయత్నాలు చేస్తూ, ఒకవైపు సామాజిక సాధికారత సాధించామంటూ బస్సు యాత్రలు చేస్తున్నారు.చేసే పనుల గురించి వైసిపి వారు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.