చోడవరం టిడిపికి కంచుకోట. కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి కేయస్ ఎన్ రాజు, కరణం ధర్మశ్రీ వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ నడిచేది. ఒకసారి కే ఎస్ ఎన్ రాజు గెలిస్తే తర్వాత కరణం ధర్మశ్రీ గెలిచారు. కరణం ధర్మశ్రీ ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జనసేన ప్రభావం తక్కువే అని చెప్పవచ్చు. క్షత్రియ ఓటర్లు తక్కువగా ఉన్నా గెలుపును ప్రభావితం చేయడంలో క్షత్రియ ఓటర్ల కీలకమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈసారి టిడిపి తరఫున పోటీ చేసే వారెవరో ఇంకా నిర్ణయించలేదు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిడిపి తరఫున ముగ్గురు రేసులో ఉన్నారు. వారిలో తాతయ్య బాబు, కే ఎస్ఎన్ రాజు, టిడిపి యువనేత కొట్టి బాలాజీ ఉన్నారు కే ఎస్ఎన్ రాజు, తాతయ్య బాబు ఎప్పుడు కలిసే ఉండేవారు కానీ కే ఎస్ఎన్ రాజుకు ఎమ్మెల్యేగా పదవి వచ్చిన తర్వాత తాతయ్య బాబును అణచివేస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి. వీరిద్దరి మధ్య నిశ్శబ్ద యుద్ధం జరుగుతోందని చెప్పవచ్చు .కానీ అనూహ్యంగా కొట్టి బాలాజీ కూడా ఈసారి టికెట్ ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బాలాజీ నారా లోకేష్ కు సన్నిహితుడు కావడంతో ఈసారి టికెట్ ఎవరికీ ఇస్తారా అన్నది మాత్రం ఎవరి అంచనాలకు అందడం లేదు.
నియోజకవర్గంలో వైసిపి పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యే పై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్న చోడవరంలో రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉండడంతో ప్రభుత్వం ఆధీనం చేసుకుని తమను ఆదుకోవాలని రైతులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా గ్రామాలకు రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలందరూ అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
ఈ పరిస్థితులలో టిడిపి ఐకమత్యంతో పనిచేస్తే టికెట్ ఎవరికీ ఇచ్చినా అందరూ కలిసి పోటీ చేస్తే చోడవరంలో కచ్చితంగా ఎగిరేది టిడిపి జెండానే.