ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఒక పార్టీ నుంచి నాయకులు మరో పార్టీలోకి మారుతూనే ఉంటారు.ఇవన్నీ ప్రజలకు,పార్టీలకు సర్వసాధారణం.కానీ కీలక నేతలు మారినప్పుడు మాత్రమే వాటి ప్రభావం ఆ పార్టీ పై ఎక్కువగా పడుతుంది.
వైసిపి నుంచి ఒక కీలక నేత,జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న ఒక మంత్రి టిడిపి వైపు చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.వార్తల్లో నిజా నిజాలు ఎలా ఉన్నా మంత్రి మౌనం మాత్రం అందరికీ అనుమానం కలిగిస్తుందని చెబుతున్నారు.ప్రతిపక్ష పార్టీని విమర్శించడంలో ఆ నాయకుడు దిట్ట.ఆ మంత్రి విమర్శిస్తే ఆ విమర్శలకు సమాధానం కూడా ఎవరి దగ్గర ఉండదు.కానీ అటువంటి నాయకుడు మౌనంగా ఉన్నాడంటే ఆలోచించాల్సిన విషయమే కదా.కానీ పార్టీ మారడంలో ఆ మంత్రి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ నాయకుని రాజకీయ జీవితం ప్రారంభమైనది టిడిపి వ్యతిరేక పార్టీ నుంచి, దశాబ్దాల కాలంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంటూ ఇప్పుడు ఆ పార్టీలో చేరితే నాయకుల ఆహ్వానించవచ్చు. కానీ క్యాడర్ మాత్రం జీర్ణించుకోవడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.నిన్నటి వరకు తమ పార్టీని విమర్శించిన నేతను ఈరోజు తమ నాయకుడిగా అంగీకరించడానికి టిడిపి క్యాడర్ అంగీకరించకపోవచ్చు.
అంతేకాకుండా ఎన్నికల ముందు పార్టీ మారిన వారిని జగన్మోహన్ రెడ్డి క్షమించరు అని విషయం అందరికీ తెలిసినదే. అలాంటప్పుడు ఇప్పుడు పార్టీ మారితే తమ పరిస్థితి ఎలా ఉంటుందా అని సంశయిస్తున్నారో ఏమో ఆ నేత ఇంకా పూర్తిగా పార్టీ మారతాను అని ఇంకా పూర్తిగా ప్రకటించలేక పోతున్నారు.ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే ఎటువంటి సమస్యలు ఉండవు కానీ టిడిపిలో కలవడానికి ఆ నేతకు కొంచెం సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఆ మంత్రి ఇంకా పూర్తిగా పార్టీ మారతాను అని ప్రకటించటం లేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.