పీలేరు-పలమనేరు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కీలకంగా ఉన్న స్థానాలు. రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువ ఉన్న స్థానాలు. గతంలో ఇవి టిడిపికి అనుకూలమైన స్థానాలే..కానీ వైసీపీ వచ్చాక..ఆ పార్టీ హవా నడుస్తున్నాయి. పలమనేరులో టిడిపి ఆరు సార్లు గెలిచింది. కానీ గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది. గతంలో టిడిపిలో పనిచేసిన అమర్నాథ్ రెడ్డి..2014లో వైసీపీ నుంచి గెలిచి మళ్ళీ టిడిపిలోకి వచ్చారు.
2019 ఎన్నికల్లో ఈయన అనూహ్యంగా ఓడిపోయారు. వైసీపీ నుంచి వెంకట్ గౌడ గెలిచారు. ఎమ్మెల్యేగా గౌడ పూర్తిగా విఫలమయ్యారు. ఆయనపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇటు అమర్నాథ్ రెడ్డి బలపడుతున్నారు. పైగా ఇక్కడ రెడ్డి వర్గం ఇప్పుడు టిడిపి వైపు చూస్తుంది. దీంతో ఈ సారి పలమనేరులో వైసీపీకి అమర్నాథ్ చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక పీలేరు విషయానికొస్తే..టిడిపి మూడుసార్లు గెలిచింది. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడిచింది. 2009లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి మధ్యలో సిఎం కూడా అయ్యారు. అయితే 2014లో వైసీపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి గెలిచారు. జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి కిరణ్ సోదరుడు కిషోర్ పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్ కిషోర్ టిడిపిలోకి వచ్చారు. 2019లో మళ్ళీ ఓటమి పాలయ్యారు. అటు చింతల వైసీపీ నుంచి గెలిచారు.
కానీ ఇప్పుడు ఎమ్మెల్యే చింతలకు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. కాకపోతే బలమైన వైసీపీ ఓటు బ్యాంకు ఆయనకు ప్లస్. ఇటు నల్లారి కిషోర్ దూకుడుగా పనిచేస్తున్నారు. సొంత బలంతో పాటు టిడిపి బలం ఈ సారి కిషోర్కు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈ సారి పీలేరు-పలమనేరులో టిడిపి జెండా ఎగిరేలా ఉంది.