జగన్ ప్రభుత్వంపై ఎవరు విమర్శ చేసిన వారిని చంద్రబాబుతో లింక్ చేసి తిట్టడం వైసీపీ నేతలకు అలవాటైన పనిగా మారిపోయింది. అసలు ఎందుకు విమర్శలు చేస్తున్నారు..ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు అనే దాని గురించి వైసీపీ నేతలు పట్టించుకోరు. జగన్ని అంటే చాలు వెంటనే మీడియా ముందుకు రావడం వారిని తిట్టడం చేస్తారు. మధ్యలో చంద్రబాబుని లాగి తిడతారు. అయితే ఇలా వైసీపీ చేయడం వెనుక రాజకీయం కోణం చాలా ఉంటుంది.
ఉదాహరణకు పవన్..జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే..ఆయన్ని చంద్రబాబు దత్తపుత్రుడు అని మాట్లాడాటారు. పవన్ సెపరేట్ గా రాజకీయం చేస్తున్న పలు అంశాలపై వైసీపీ చేస్తున్న తప్పులని ఎత్తిచూపుతున్న సరే..కేవలం బాబుని లాగి పవన్ని తిడతారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు. ఇప్పుడు తాజాగా పురందేశ్వరిని టార్గెట్ చేశారు. ఏపీ బిజేపి అధ్యక్షురాలుగా ఉన్న ఆమెపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల పురందేశ్వరి దూకుడుగా ముందుకెళుతున్నారు. ఏపీ అప్పులపై, ఆర్ధిక పరిస్తితులు, పంచాయితీ నిధులు..ఇలా పలు అంశాల గురించి మాట్లాడుతున్నారు.
కానీ వాటి అన్నిటికి సమాధానం చెప్పకుండా..కేవలం పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. మరిది కోసం వదిన పనిచేస్తుందని కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబుని గెలిపించడం కోసం పురందేశ్వరి కష్టపడుతున్నారని అంటున్నారు. అసలు బిజేపికి-టిడిపికి సంబంధం లేదు. పురందేశ్వరి కూడా ఎప్పుడు బాబుకు సపోర్ట్ గా మాట్లాడలేదు.
కానీ ఇప్పుడు వైసీపీ ఇలా చేయడం వెనుక రాజకీయ కోణం ఉంది. మొదట బిజేపి-టిడిపి ఒక్కటే అనే విధంగా చేయడం..అలా చేస్తే బిజేపిపై వ్యతిరేకత టిడిపిపైకి వస్తుంది. అలాగే వైసీపీ చేస్తున్న తప్పులు ప్రజల్లోకి వెళ్లకుండా చేయడం. అందుకే ఎవరు ఏ అంశం గురించి మాట్లాడిన వాటి గురించి కాకుండా మాట్లాడిన వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. ఇది వైసీపీ చేస్తున్న రాజకీయం. కానీ ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు.