రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదు అన్నట్లు ఉంది. ప్రతి వ్యవస్థ కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో అధికార పార్టీకి ఎదురు నిలిచే వారే లేకుండా ఉన్నారు. ఎదురు నిలిచిన వారిని అక్రమ అరెస్టులతో జైలుకు పంపిస్తున్నారు.. ఇలాంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ యువత చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు అని, ఈ ఓటుతోనే రాష్ట్రంలోని అరాచక పాలనకు స్వస్తి చెప్పాలని టిడిపి పిలుపునిస్తుంది. ఓటే కదా అని అశ్రద్ధ చేయకుండా అక్టోబర్ రెండు లోపు 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా సరే సొంత గ్రామాలకు వచ్చి తమ ఓటు ను నమోదు చేసుకోవాలని టిడిపి నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు కోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్ కానీ కస్టడీ తర్వాత వచ్చే తీర్పు గాని ఏది ఏమైనా తీర్పు మనకి అనుకూలంగా వచ్చిన ప్రతికూలంగా వచ్చిన గుండె దిటవు చేసుకుని స్వీకరించటానికి ధైర్యంగా ఉందాం అని టిడిపి శ్రేణులు చెబుతున్నారు.
వైసీపీ అరాచక పాలనకు ప్రతి ఒక్కరు తమ ఓటుతో సమాధానం చెప్పాలి అని నిరాశలో ఉన్న టిడిపి శ్రేణులకు ఉత్సాహాన్ని నింపుతున్నారు టిడిపి నాయకులు. కాబట్టి 18 ఏళ్ళు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవడం..అలాగే టిడిపి ఓటర్లు..తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవడం చేయాలి. అటు దొంగ ఓట్ల పై నిఘా పెట్టాలి.