ఎస్సీ రిజర్వడ్ అసెంబ్లీ స్థానాలు..మొదట నుంచి కాంగ్రెస్ హవా నడుస్తున్న స్థానాలు. ఇప్పుడు వైసీపీ కంచుకోటలుగా ఉన్నాయి.గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తుంది. వైసీపీని గెలిపిస్తున్న సరే ఎస్సీ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఎస్సీ స్థానాలకు అభివృద్ధి లేదు. ఇక వైసీపీ అధికారంలో…ఎస్సీలపైనే ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు వచ్చాయి. వారిపై దాడులు పెరిగాయి. వారికి సరైన న్యాయం జరగడం లేదు.
దీంతో ఎస్సీ స్థానాల్లో పూర్తి మార్పు కనిపిస్తుంది. ఈ సారి వైసీపీ హవా నడవటం కష్టమే. చాలా చోట్ల టిడిపి బలపడుతుంది.ఇదే క్రమంలో ఉమ్మడి గుంటూరులోని రిజర్వడ్ స్థానాల్లో సీన్ మారుతుంది. జిల్లాలో మూడు స్థానాలు ఉన్నాయి. తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మూడు చోట్ల వైసీపీ గెలిచింది. అయితే ఈ మూడు కూడా అమరావతి రాజధానికి దగ్గరగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు చోట్ల వైసీపీకి వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉంది.
అటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎలాగో వైసీపీ నుంచి బయటకొచ్చారు. అయితే ఈ సారి అక్కడ ఎవరు బరిలో ఉన్న వైసీపీ
నుంచి ఓటమి ఖాయమని తెలుస్తుంది. ఇటు ప్రత్తిపాడులో మాజీ మంత్రి సుచరిత ఉన్నారు. ఈమెకి పెద్ద పాజిటివ్ లేదు. పైగా టిడిపి-జనసేన కలిస్తే ఈమె గెలుపు కష్టమే.
అటు వేమూరులో మంత్రి మేరుగు నాగార్జున ఉన్నారు. ఈయనపై యాంటీ ఎక్కువగానే ఉంది. మంత్రిగా ఉంటూ ఇసుక అక్రమం దోచుకుంటున్నారని టిడిపి నేత నక్కా ఆనందబాబు ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశం మంత్రికి మైనస్.మంత్రిగా ఉంటూ నియోజకవర్గంలో చేసిన అభివృధ్ది శూన్యం. దీంతో ఈయన గెలుపు డౌటే. ఈ మూడు చోట్ల టిడిపి హవా నడిచేలా ఉంది.