బలం ఉన్న చోట ఎవరికైనా గెలుపు ఈజీనే..కానీ బలం ఉన్నా సరే టిడిపికి గెలుపు దక్కని నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలాంటి స్థానాల్లో సంతనూతలపాడు ఒకటి. ఇక్కడ టిడిపికి బలం ఎక్కువే. ఎస్సీ రిజర్వడ్ సీటు అయినా సరే ఇక్కడ టిడిపికి పట్టు ఎక్కువ. కానీ వైసీపీ రాజకీయం..టిడిపిలో వర్గ విభేదాలు ఉండటం కలిసి రావడం లేదు. గత కొన్ని ఎన్నికల నుంచి ఇదే పరిస్తితి.
ఇక్కడ ఎస్సీ, బీసీలతో పాటు కమ్మ వర్గానికి పట్టు ఎక్కువ. కానీ కమ్మ వర్గం ఓట్లు టిడిపికి పూర్తిగా పడవు. గత రెండు ఎన్నికల్లో అదే జరిగింది. అందుకే వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే ఇక్కడ టిడిపి గెలిచి చాలా ఏళ్ళు అయింది. ఎప్పుడో 1999లో గెలిచింది అంతే..మళ్ళీ ఇంతవరకు గెలవలేదు. గత ఎన్నికల్లో 9 వేల ఓట్ల తేడాతో వైసీపీ నుంచి సుధాకర్ బాబు గెలిచారు. టిడిపి నుంచి బిఎన్ విజయ్ కుమార్ ఓడిపోయారు. 2014లో కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలా తక్కువ ఓట్లతో విజయ్ ఓడిపోతున్నారు.
అయితే టిడిపిలో ఉండే కమ్మ వర్గం ఈయనకు పూర్తిగా సహకరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీని వల్ల ఆయనకు ఓటమి వస్తుంది. కానీ ఈ సారి వైసీపీ…కమ్మ వర్గాన్ని ఏ విధంగా టార్గెట్ చేసిందో చెప్పాల్సిన పని లేదు. దీని వల్ల కమ్మ వర్గం వైసీపీకి యాంటీ అయింది. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన కమ్మ నేతలు కూడా మారిపోయారు. అటు ఎమ్మెల్యే సుధాకర్ బాబు వైసీపీలోని కమ్మ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో వారు ఈ సారి ఎమ్మెల్యేకు సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. ఇటు లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. దీంతో ఈ అంశాలు టిడిపికి కలిసొస్తాయి. ఈ సారి గెలిచే ఛాన్స్ ఉంది. ఈ సారి గెలవకపోతే టిడిపికి మళ్ళీ ఛాన్స్ దొరకదనే చెప్పాలి.