రాజకీయాల్లో దూకుడుగా ఉండటం అనేది సహజమే..ఆ దూకుడుతోనే ప్రత్యర్ధులకు చెక్ పెడుతూ..బాగా క్రేజ్ తెచ్చుకుంటారు. అయితే ఏపీలో అలా దూకుడుగా రాజకీయం చేసే నేతలు చాలామందే ఉన్నారు. ప్రత్యర్ధులపై అగ్రెసివ్గా ముందుకెళ్తారు. అలాగే ప్రత్యర్ధులపై విరుచుకుపడతారు. ఇక ఇప్పుడు దూకుడుగా రాజకీయం చేయడం అంటే..ప్రత్యర్ధులని బూతులు తిట్టడమే పనిగా మారింది.
ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు అదే పంథాలో రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యేలైన, మంత్రులైన వారి టార్గెట్ ఒకటే..చంద్రబాబు, పవన్లని బూతులు తిట్టడం, జగన్కు భజన చేయడం, ప్రజలకు సేవ చేద్దామనే కాన్సెప్ట్ పెద్దగా లేదు. అలా చేసిన వారికి పదవులు కూడా వస్తున్నాయి. అలా పదవులు సాధించిన వారిలో మంత్రి జోగి రమేష్ కూడా ఒకరు. ఈయన చంద్రబాబు ఇంటిపైకి తన అనుచరులని తీసుకుని దాడికి వెళ్లారు..అలాగే అసెంబ్లీలో బాబు, రఘురామకృష్ణంరాజులని బూతులు తిట్టారు. ఇలా చేయడం వల్లే ఆయనకు మంత్రి పదవి వరించింది.
ఇక మంత్రిగా ఉంటూ ప్రజలకు సేవ చేయాల్సిన ఈయన..ప్రత్యర్ధులని తిట్టే పనిలోనే ఉన్నారు. పైగా అధికార పెత్తనం ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. ఆఖరికి ఈయన కాన్వాయ్ రోడ్డు పై వెళుతుంటే..అంతా నిలుచుని ఉండాలంటా..లేదంటే కేసులు పెడుతున్నారు. తాజాగా ఆయన అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపనకు వెళ్ళి..బాబు, పవన్, లోకేష్ లని దారుణంగా తిట్టారు. బాబుని ఏమో ముసలి నక్క అని, లోకేష్ని ఊర పంది అని, పవన్ని పిచ్చి కుక్క అని తిట్టేశారు. వీరంతా చిత్తకార్తి కుక్కలు అని తిట్టారు. ఈయన తిడుతుంటే జగన్ నవ్వుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక ఇలా నోరు పారేసుకునే వారికి ప్రజలే చెక్ పెట్టేలా ఉన్నారు. అలా బూతులు తిట్టడం వల్లే మంత్రి పదవి తెచ్చుకున్నారు. అదే కంటిన్యూ చేయడం వల్ల నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలే జోగిని ఓడిస్తారని టిడిపి శ్రేణులు అంటున్నాయి.