వైసీపీలో అంతర్గత పోరు తగ్గడం లేదు. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు నడుస్తుంది. ఎమ్మెల్యేలకు, వైసీపీ నేతలకు పడటం లేదు. సీటు కోసం పోటీ పడుతున్నారు. దీని వల్ల వైసీపీకే డ్యామేజ్ జరిగేలా ఉంది. ఇప్పటికే రామచంద్రాపురం సీటులో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ల మధ్య రచ్చ నడుస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆ సీటు తనకే కావాలని బోస్ అంటున్నారు. జగన్ చెప్పిన సర్దుకోవడం లేదు. ఒకవేళ సీటు వేణుకి ఇస్తే తాను గాని, తన తనయుడుగాని ఇండిపెండెంట్ గా పోటీచేస్తామని అంటున్నారు.
ఈ రచ్చ ఇలా సాగుతుండగానే గన్నవరంలో నెక్స్ట్ తానే పోటీ చేస్తానని వైసీపీ నుంచి కుదరకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్రావు అంటున్నారు. గత ఎన్నికల్లో ఈయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక టిడిపి నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చారు. అప్పటినుంచి వంశీ వర్సెస్ యార్లగడ్డ అన్నట్లు పోరు నడుస్తుంది.
అటు మరో నేత దుట్టా రామచంద్రారావు సైతం వంశీకి యాంటీగా ఉన్నారు. వీరిని జగన్ కలపడానికి చూశారు గాని..అదేం సెట్ కాలేదు. ఇప్పుడు దుట్టా-యార్లగడ్డ ఒక్కటయ్యి అయ్యి..వంశీకి యాంటీగా ఉన్నారు. తాజాగా దుట్టాని కలిసిన యార్లగడ్డ..నెక్స్ట్ ఎన్నికల్లో గన్నవరం నుంచి తానే పోటీ చేస్తానని అన్నారు. అయితే వైసీపీ సీటు వంశీకే ఇస్తారు. అందులో డౌట్ లేదు.
దీంతో యార్లగడ్డ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అంటున్నారు. అయితే ఈయన ఎన్నికల సమయంలో టిడిపిలోకి వెళ్ళి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతుంది. చూడాలి మరి వంశీకి యార్లగడ్డ వల్ల ఎంత రిస్క్ ఉంటుందో.