రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికార వైసీపీ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. టిడిపి అనుకూల పవనాలు ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి విజయం సాధించేది తమ పార్టీనే అని టిడిపి నేతలు ధీమాగా ఉన్నారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత టిడిపికి ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పవచ్చు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి టిడిపి కచ్చితంగా గెలిచే స్థానాలు 50 వరకు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అవి ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాలవలస, బొబ్బిలి, రాజాం, భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ వెస్ట్, గాజువాక, పెందుర్తి, నర్సీపట్నం, ముమ్మిడివరం, నిడదవోలు, పాలకొల్లు, మండపేట, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, ఆచంట, చింతలపూడి, మచిలీపట్నం, పెనమలూరు, విజయవాడ సెంట్రల్, నందిగామ, జగ్గయ్యపేట, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పర్చూరు, అద్దంకి, కొండపి, ఆత్మకూరు, నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్, గూడూరు, ఉరవకొండ, తాడిపత్రి, రాప్తాడు, నగరి, పలమనేరు, శ్రీకాళహస్తి వీటన్నింటిలో టిడిపి కచ్చితంగా నూటికి నూరు శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, ఎమ్మెల్యేలపై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. నియోజకవర్గాలలో అభివృద్ధి శూన్యమని, నియోజకవర్గ ప్రజలందరూ వైసిపి పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అందువల్ల ఈసారి ఇక్కడ అభ్యర్థి ఎవరైనా టిడిపి కచ్చితంగా విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ReplyReply allForwardAdd reaction |