మంత్రులకే టిక్కెట్లు లేవా??
రాబోయే ఎన్నికల్లో విజయాన్ని టిడిపి, వైసిపి రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. గెలిచే అభ్యర్థుల కోసం ప్రయత్నాలు చేసి, గెలిచే వారిని మాత్రమే తమ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. అందుకోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా, ఎవరిని ఇబ్బంది పెట్టిన పర్వాలేదని అధికార వైసిపి భావిస్తోంది.
గత ఎన్నికల్లో గెలిచి పార్టీకి అండగా ఉన్న మంత్రులను సైతం ఈసారి పక్కన పెట్టాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను వేరే చోటికి మారుస్తానని లేదా టికెట్ లేకపోయినా అందరూ తనవారేనని జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు. ఎమ్మెల్యేల వరకు పరవాలేదు కానీ పార్టీకి అండగా ఉన్న మంత్రులను సైతం పక్కన పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈసారి జగన్ క్యాబినెట్ లో మంత్రులుగా చేసిన ఎమ్మెల్యేలను కూడా పక్కన పెడుతున్నారని తెలుస్తుంది. వారిలో శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, నారాయణస్వామి వీరందరికీ ఈసారి టికెట్ ఇవ్వకూడదని వైసిపి ప్రభుత్వం భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చివరిలో ఒకరిద్దరికీ స్థానచలనం చేసి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప వీరందరినీ ఖచ్చితంగా ఈసారి పోటీ నుంచి పక్కన పెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
రాబోయే ఎన్నికల్లో విజయాన్ని టిడిపి, వైసిపి రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. గెలిచే అభ్యర్థుల కోసం ప్రయత్నాలు చేసి, గెలిచే వారిని మాత్రమే తమ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. అందుకోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా, ఎవరిని ఇబ్బంది పెట్టిన పర్వాలేదని అధికార వైసిపి భావిస్తోంది.
గత ఎన్నికల్లో గెలిచి పార్టీకి అండగా ఉన్న మంత్రులను సైతం ఈసారి పక్కన పెట్టాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను వేరే చోటికి మారుస్తానని లేదా టికెట్ లేకపోయినా అందరూ తనవారేనని జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు. ఎమ్మెల్యేల వరకు పరవాలేదు కానీ పార్టీకి అండగా ఉన్న మంత్రులను సైతం పక్కన పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈసారి జగన్ క్యాబినెట్ లో మంత్రులుగా చేసిన ఎమ్మెల్యేలను కూడా పక్కన పెడుతున్నారని తెలుస్తుంది. వారిలో శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, నారాయణస్వామి వీరందరికీ ఈసారి టికెట్ ఇవ్వకూడదని వైసిపి ప్రభుత్వం భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చివరిలో ఒకరిద్దరికీ స్థానచలనం చేసి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప వీరందరినీ ఖచ్చితంగా ఈసారి పోటీ నుంచి పక్కన పెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.