ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలలో ఎన్నికల వాతావరణం కనబడుతోంది. గెలిచే అభ్యర్థులను బరిలో దించడానికి అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్లు ఆశించిన వారందరూ కోరుకున్న పార్టీలలో చేరి టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
క్రికెటర్ అంబటి రాయుడు కొంతకాలంగా వైసీపీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అంబటి రాయుడుకు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన అంబటి రాయుడు గెలిచే స్థానంలో ఎంపీగా పోటీ చేయొచ్చు గాని, 2019లో జగన్ గాలిలో కూడా గుంటూరు ఎంపీ స్థానాన్ని గల్లా జయదేవ్ గెలుచుకున్నారు. అటువంటి చోట అంబటి రాయుడు పోటీ చేయడమంటే సాహసమే కదా. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితులు కూడా వైసిపికి సానుకూలంగా లేవు. రాజధాని విషయం వల్ల గుంటూరు లో ప్రజలందరూ, అమరావతి రైతులు వైసీపీపై వ్యతిరేకతతో ఉన్నారు. అటువంటి చోట రాయుడు పోటీ చేస్తే ఓటమి తప్పదు కదా. గుంటూరు లో గెలుపును శాసించేది కమ్మ సామాజిక వర్గం వారే. ఇప్పటివరకు గుంటూరు ఎంపీ స్థానంలో ఎక్కువగా గెలిచినవారు కూడా కమ్మ సామాజిక వర్గం వారే. కానీ రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం వల్ల కూడా అతనికి గెలిచే అవకాశాలు తక్కువ అని చెప్పవచ్చు. అంతేకాకుండా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాలలో గ్రూపు తగాదాలతో సతమతమవుతున్నారు. అంబటిని ఏ వర్గం వారు గెలిపిస్తారా అని అన్నది ప్రశ్నార్థకమే. అంతేకాక గుంటూరులో అభివృద్ధి జరగలేదని ప్రజలందరిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నియోజకవర్గం టిడిపికి కంచుకోట. ఎంపీగా గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఈసారి కూడా విజయం సాధిస్తానని ధీమాతో గల్లా జయదేవ్ ఉన్నారు. మరి ఇన్ని వ్యతిరేకతలు ఉన్న నియోజకవర్గంలో ఉన్న స్థానంలో పోటీ అంటే అంబటి రాయుడు సాహసం చేస్తున్నట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓటమి పొందితే పరాభవం తప్ప అంబటి రాయుడు ఒరిగేదేమీ ఉండదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఎన్నికలవేళ ఇంకెన్ని చిత్రాలు చూడాలో..
ReplyReply allForwardAdd reaction |