ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వైసిపి ఇన్చార్జిలో మార్పుతో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంది. గెలిచే అభ్యర్థులని బరిలో దించాలని ఆలోచనతో నియోజకవర్గంలో పట్టున్న నేతలను కాకుండా సర్వేలు నిర్వహించి ఎవరైతే విజయం సాధిస్తారో వారికి టిక్కెట్లు ఇవ్వాలని వైసిపి భావిస్తోంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గాలలో ఇప్పటివరకు ఎవరు ఇంచార్జిగా ఉంటారో, రాబోయే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో ఇంకా స్పష్టత రాలేదు. గిద్దలూరు నుంచి అన్నె రాంబాబు ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. కొండపి ఇంచార్జిగా ఉన్న సురెష్ కి ఎర్రగొండపాలెం ఇచ్చారు. వేమూరు నుంచి నాగార్జునను మార్చి సంతనూతలపాడు ఇచ్చారు. మరి వేమూరు ఆమంచి కృష్ణమోహన్ కి ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒంగోలు, చీరాల, పర్చూరు, దర్శి, మార్కాపురం, కరిగిరి ఈ నియోజకవర్గాలలో ఇంకా పోటీ చేసే అభ్యర్థులు ఎవరో కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు వైసీపీ నేతలు. ఎంపీ టికెట్ కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కాకుండా కొత్తవారి కోసం అన్వేషణలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి పట్టుంది. కానీ వైసీపీ మాత్రం రెడ్డి సామాజిక వర్గం వారికి ఎక్కువగా టికెట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి వైసిపి తీసుకునే ఈ నిర్ణయాలను ప్రకాశం ప్రజలు స్వాగతిస్తారా లేక ఎన్నికల్లో తమదైన శైలిలో సమాధానం చెప్తారా వేచి చూడాల్సిందే….