ఇంతకాలం ఎదురులేదు అన్నట్లుగా రాజకీయం చేస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గట్టి పోటీ ఇవ్వడానికి టిడిపి సిద్ధమైంది. ఇప్పటివరకు సరైన అభ్యర్ధి దొరకక టిడిపి ఎదురుచూసింది. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు రూపంలో టిడిపికి బలమైన అభ్యర్ధి దొరుకుతున్నాడని, గన్నవరంలో వంశీకి గట్టి పోటీ ఎదురుకాబోతుందని కృష్ణా జిల్లా తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు.
గత ఎన్నికల్లో వంశీ టిడిపి నుంచి గెలిచి..తర్వాత వైసీపీలోకి జంప్ చేసి..చంద్రబాబు, లోకేష్లని ఎలా తిట్టారో తెలిసిందే..అలాగే ఫ్యామిలీని సైతం తిట్టారు. దీంతో వంశీకి చెక్ పెట్టాలని టిడిపి శ్రేణులు కసితో రగిలాయి. పైగా అక్కడ టిడిపికి సరైన నాయకుడు దొరకలేదు. కొంతకాలం బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్ గా పెట్టారు గాని..ఆయన ఆ మధ్య అనారోగ్యంతో చనిపోయారు. ఈ నేపథ్యంలో గన్నవరంలో టిడిపి అభ్యర్ధి లేకుండా పోయారు.ఇదే క్రమంలో అక్కడ టిడిపి శ్రేణులపై ఎలా దాడులు జరిగాయో తెలిసిందే. ఇక ఈ సీటు కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. దేవినేని చందు, పట్టాభి, దాసరి బాలవర్ధన రావు..ఇలా కొంతమంది సీటు ఆశిస్తున్నారు.
కానీ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి..వైసీపీలో ప్రాధాన్యత లేకుండా వంశీతో కలవలేక..తన అనుచరులతో సమావేశమై..ఇక రాజకీయంగా టిడిపిలోకి వచ్చి..వంశీకి చెక్ పెట్టాలని యార్లగడ్డ వెంకట్రావు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే చంద్రబాబుని అపాయింట్మెంట్ కోరారు. సీటు అడిగారు.వంశీని ఓడిస్తానని అంటున్నారు.
యార్లగడ్డకు సీటు ఇస్తే..వంశీకి గట్టి పోటీ ఉంటుందని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. గన్నవరంలో కమ్మ, బిసి, ఎస్సీ ఓట్లు ఎక్కువ. అయితే మెజారిటీ కాస్త వంశీ వైపే కనిపిస్తోంది. ఇప్పుడు యార్లగడ్డ రావడంతో వైసీపీలోని అసలైన కార్యకర్తలు..టిడిపి వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఇటు టిడిపి శ్రేణుల బలం ఉంది. ఆర్ధికంగా, సామాజికంగా వంశీతో యార్లగడ్డ గట్టి పోటీ ఇస్తారు. మొత్తానికి గన్నవరంలో హోరాహోరీ పోరు ఉంటుంది. మరి వంశీకి యార్లగడ్డ చెక్ పెట్టగలుగుతారో లేదో చూడాలి.