అధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ఇక్కడ ఎవరికి ఆధిక్యం ఉన్నదనేది ఎవరికి తెలియడం లేదు. గత ఎన్నికలో స్వల్ప మెజారిటీతో వైసీపీ గెలిచింది..కానీ మళ్ళీ వైసీపీ గెలుపుపై డౌట్ ఉంది. అలా అని టిడిపి బలంగా ఉందా? అంటే అది డౌటే. ఇటు జనసేనకు గెలిచే ఛాన్స్ లేదు. ఇలా ఊహించని రాజకీయం నడుస్తుంది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి వారు గెలిచిన తిరుపతిలో ఈ సారి గెలుపు ఎవరిదనేది ఊహకు అందడం లేదు.
ప్రస్తుతానికి ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఈయన పనితీరు బాగానే ఉంది..కానీ అనుకున్న మేర పాజిటివ్ కనిపించడం లేదు. పైగా భూమన పోటీ చేస్తారో..ఆయన తనయుడు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. ఇక టిడిపి నుంచి సుగుణమ్మ ఉన్నారు..గత ఎన్నికల్లో కేవలం 700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తర్వాత అనుకున్న మేర టిడిపిని బలోపేతం చేయడంలో ఆమె విఫలమయ్యారు. మరో టిడిపి నేత నరసింహ యాదవ్ సైతం తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉంటూ సాధించింది ఏమి లేదు.
ఇద్దరు కలిసి తిరుపతి కార్పొరేషన్ లో టిడిపికి కనీసం గౌరవ ప్రదమైన విజయాన్ని కూడా అందించలేదు. ఇటు జనసేన లో సీటు కోసం కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తిరుపతిలో జనసేనకు 12 వేల ఓట్లు పడ్డాయి. కానీ జనసేన బలం అది కాదు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి చిరంజీవి పోటీ చేసి గెలిచారు.
ఇక్కడ జనసేనకు 30 వేల ఓటు బ్యాంకు ఉంటుంది. దాంతో జనసేన సింగిల్ గా గెలవడం కష్టం. బిజేపికి బలం లేదు. అయితే టిడిపి-జనసేన కలిస్తే వైసీపీని ఓడించవచ్చు.అలా కాకుండా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీకి లాభం. చూడాలి మరి తిరుపతిలో ఏం జరుగుతుందో.