ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు కొదవలేదు. ఆ సంక్షేమ పథకాలే తమ పార్టీ నీ ఈసారి గెలిపిస్తాయని వైసిపి నేతలు ధీమాతో ఉన్నారు. కానీ ప్రజలలో ముఖ్యంగా మహిళలలో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని రాజకీయ వర్గాలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇప్పుడు వైసిపి ఓటు బ్యాంకును పూర్తిగా తారుమారు చేసింది. బాబు అరెస్ట్ పూర్తిగా కక్షపూరితమని, ఈ వయసులో అరెస్ట్ చేయడం సామాన్య ప్రజలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అధికార పార్టీని బహిరంగంగానే కొందరు విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్కు నిరసనగా ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ప్రజల్లో ఉంటున్నారు. అయితే వీరికి మహిళల నుంచి భారీ మద్దతు వస్తుంది.
ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో స్వచ్ఛందంగా మహిళలందరూ పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. భువనేశ్వరికి, టిడిపికి తమ మద్దతు పూర్తిగా ఉంటుందని, మహిళలందరూ భువనేశ్వరి తో అన్నారని టిడిపి ప్రముఖులు అంటున్నారు.
సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వడ్డీతో సహా వసూలు చేస్తున్నారని అంటున్నారు, నిత్యావసర ధరల పెరుగుదలతో పాటు, పన్నుల భారం, కరెంటు బిల్లు మొదలైన వాటి వల్ల మహిళలలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత కనపడుతుంది. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపి గెలుపు కష్టమే అని రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా అంటున్నారు. గత ఎన్నికల్లో పూర్తిగా వైసీపీకి మద్దతు తెలిపిన మహిళలు ఇప్పుడు టిడిపి వైపుకు వస్తున్నారు.
ReplyReply allForward |