ఈ సారి గెలుపు అనేది టిడిపికి చాలా ముఖ్యమని చెప్పాల్సిన పని లేదు. గెలిస్తేనే పార్టీకి తిరుగుండదు..ఓడితే మాత్రం..జగన్..టిడిపిని ఎన్ని రకాలుగా దెబ్బకొడతారో చెప్పాల్సిన పని లేదు. అందుకే గెలుపు కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇదే క్రమంలో పొత్తుల కోసం బాబు ముందుకెళుతున్నారు. ఇప్పటికే పవన్ తో కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. బాబు-పవన్ మూడుసార్లు కలిశారు. అధికారికంగా జనసేనతో పొత్తు ఫిక్స్ కాలేదు గాని…అనధికారికంగా బాబు, పవన్ ఒక ప్లాన్ తో పనిచేస్తున్నారని తెలుస్తుంది.
ఇదే సమయంలో బాబు..జనసేనకు కేటాయించే సీట్లలో పర్యటించడం లేదు..అలాగే ఆయా సీట్లలో డమ్మీ ఇంచార్జ్లని పెట్టడం లేదా అసలు ఇంచార్జ్లనే పెట్టకుండా ఉంటున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అలా చేయడం లేదు..తనదైన శైలిలో దూకుడుగా వెళుతూ..టిడిపికి పట్టున్న స్థానాల్లో కూడా పర్యటించేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇటీవల తణుకు నియోజకవర్గంలో పర్యటించడం. అలాగే అక్కడ జనసేన అభ్యర్ధిని ప్రకటించడం. గత ఎన్నికల్లో తణుకులో టిడిపి కేవలం 2 వేళ ఓట్ల తేడాతోనే ఓడింది. అక్కడ జనసేనకు పడిన ఓట్లు 32 వేలు.
అయినా సరే ఆ స్థానంపై పవన్ ఫోకస్ పెట్టారు. ఇటు తాజాగా పిఠాపురం, రాజానగరం, కొవ్వూరు స్థానాల్లో ఇంచార్జ్లని ప్రకటించారు. అయితే ఈ మూడు సీట్లలో టిడిపి బలంగానే ఉంది. అలాంటప్పుడు పవన్ ఆలోచించి చేస్తున్నారా? లేక ఇంచార్జ్లని ఉండాలని పెడుతున్నారా? అనేది తెలియడం లేదు గాని..టిడిపి స్థానాల్లో పవన్ పర్యటనలపై తమ్ముళ్ళు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. మరి చూడాలి సీట్ల విషయంలో బాబు-పవన్ ఎలా ముందుకెళ్తారో.