వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంపై ఎలా ఫోకస్ పెట్టారో చెప్పాల్సిన పని లేదు. అక్కడ చంద్రబాబుని ఓడించడానికి తెగ ట్రై చేస్తున్నారు. అధికార బలంతో స్థానిక ఎన్నికలు, కుప్పం మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుంది. కానీ అదే అధికార బలంతో కుప్పం అసెంబ్లీని సైతం గెలవాలని చూస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపైనే ఫోకస్ పెట్టి రాజకీయం నడిపిస్తున్నారు. అక్కడ అభ్యర్ధిగా భరత్ని ఫిక్స్ చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు.
ఇక భరత్ని గెలిపిస్తే మంత్రిని చేస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ అక్కడ లాజిక్ ఏంటంటే..అటు చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి కుప్పం ప్రజలని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో వారు సైలెంట్ గా ఉంటున్నారు. అసలు కుప్పంకు బాబు ఏం చేశారో వారికి తెలుసు. అందుకే దశాబ్దాల నుంచి బాబుని గెలిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అధికార బలం ప్రదర్శించిన సరే ఎన్నికల సమయం వచ్చేసరికి వైసీపీకి చెక్ పెట్టి మళ్ళీ బాబుని గెలిపించుకోవడం ఖాయం.
అయితే కుప్పంలో ఏదొక విధంగా గెలవడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్కడ భారీగా టిడిపి ఓటర్లని తొలగించి..వైసీపీ నుంచి దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నట్లు టిడిపి ఆరోపణలు చేస్తుంది. కానీ దీన్ని పెద్దిరెడ్డి రివర్స్ లో చెబుతున్నారు. ఇంతకాలం బాబు దొంగ ఓట్లతో గెలుస్తున్నారని, వాటిని తొలగిస్తున్నామని, అందుకే ఈ సారి బాబు ఓడిపోతారని చెబుతున్నారు.
అసలు వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు కుప్పంలో దొంగ ఓట్ల గురించి చర్చ లేదు. మరి గతంలో పెద్దిరెడ్డి దొంగ ఓట్లు అని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నలు వస్తున్నాయి. వైసీపీ తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో దొంగ ఓట్లు ఎలా వేయించిందో తెలిసిందే అని, అందుకే కుప్పంలో దొంగ ఓట్లు నమోదు చేస్తే..రివర్స్ లో టిడిపి దొంగ ఓట్లు అంటున్నారని, కానీ అవేమీ వర్కౌట్ కావని కుప్పం ప్రజలు వైసీపీకి గట్టిగానే బుద్ధి చెబుతారని అంటున్నారు.