గత కొన్ని రోజులుగా వినుకొండ పేరు ఎక్కువ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో వినుకొండ హాట్ టాపిక్ అయింది. అక్కడ టిడిపి, వైసీపీల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయిలో జరుగుతుంది. అయితే అధికార బలంతో టిడిపిని దెబ్బతీయాలని వైసీపీ ప్రయత్నిస్తుంది..కానీ అదే రివర్స్ అయ్యి టిడిపిని గెలుపు దిశగా తీసుకెళుతుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదమే అనే సంగతి చెప్పాల్సిన పని లేదు.
ఈయన భూ కబ్జాలు, అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా చేస్తున్నారని పెద్ద ఎత్తున టిడిపి ఆరోపణలు చేస్తుంది. ఇక సొంత పార్టీ వాళ్ళని సైతం ఈయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈయన అక్రమాలు చేస్తున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోరాటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బొల్లా అధికార బలంతో జీవీతో పాటు టిడిపి నేతలపై కేసులు పెట్టించినట్లు తెలిసింది.
ఈ కేసులు అక్రమ కేసులని జీవీ టిడిపి శ్రేణులతో ర్యాలీ చేస్తుంటే..ఆ ర్యాలీలోకి బొల్లా తన అనుచరులని తీసుకొచ్చి టిడిపి శ్రేణులపై దాడులు చేసిన అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇలా బొల్లా టిడిపిని దెబ్బతీయాలని చెబుతూ అధికార బలాన్ని వాడుతున్న తీరుపై వినుకొండ ప్రజల్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఎమ్మెల్యేగా గొప్ప పనితీరు ఏమి లేదని, పైగా రాజకీయంగా అజమాయిషీ చేస్తూ..ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని టిడిపి శ్రేణులు అంటున్నాయి. అలా చేయడంతోనే టిడిపికి ప్లస్ అవుతుందని, బొల్లా చేసే రాజకీయమే జీవీని గెలిపిస్తుందని అంటున్నారు.