రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం అనేది టిడిపికి ముఖ్యం. ఆ పార్టీ గాని అధికారంలోకి రాకపోతే ఇంకా పార్టీ భవిష్యత్ ఇబ్బందుల్లో పడుతుంది అందుకే చంద్రబాబు రాజకీయంగా వైసీపీ నుంచి ఎన్ని ఎదురుదెబ్బలు తగిలిన మళ్ళీ నిలబడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో బలమైన నేతలని నిలబెట్టి గెలుపు దిశగా తీసుకెళుతున్నారు.
అయితే ఇలా బాబు కష్టపడుతుంటే..ఆ కష్టాన్ని కొందరు టిడిపి నేతలు వృధా చేస్తున్నారు. పైగా సీట్ల కోసం కొట్లాడుకుంటూ పార్టీని నష్టపరుస్తున్నారు. దీని వల్ల గెలిచే సీట్లలో కూడా దెబ్బతినేలా ఉంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో అదే పరిస్తితి కనిపిస్తుంది. ఇక్కడ టిడిపికి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అక్కడ నేతలు సీటు కోసం ఫైట్ చేస్తూ పార్టీని ముంచేలా ఉన్నారు. మామూలుగా పెడన సీటు దివంగత కాగిత వెంకట్రావుకు ఉండేది.
గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకుని తన తనయుడు కాగిత కృష్ణప్రసాద్ని నిలబెట్టారు. హోరాహోరీ పోరులో వైసీపీ నుంచి పోటీ చేసిన జోగి రమేశ్ చేతిలో 6 వేల ఓట్ల తేడాతో కాగిత ఓడిపోయారు. అటు జనసేన 25 వేల ఓట్లకు వరకు చీల్చి టిడిపిని దెబ్బతీసింది. ఇక గెలిచిన జోగి పెడనకు చేసిందేమి లేదు. మంత్రిగా చేస్తుందేమీ లేదు. పైగా అక్కడ వైసీపీ నేతల అక్రమాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు ఉన్నాయి.
దీంతో ఈ సారి అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఇటు ఇంచార్జ్ గా కాగిత కృష్ణప్రసాద్ కష్టపడుతున్నారు. వెంకట్రావు చనిపోయాక నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు.నెక్స్ట్ సీటు ఈయనకే..గెలుపు కూడా ఫిక్స్ అనుకునే తరుణంలో మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ రూపంలో పోరు మొదలైంది. నెక్స్ట్ పెడనలోనే పోటీ చేస్తానని అంటున్నారు. అటు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఫ్యామిలీ సైతం పెడన సీటుపైనే ఫోకస్ పెట్టారు.
అలా మూడు వర్గాల మధ్య రచ్చ నడుస్తుంది. అయితే మెజారిటీ టిడిపి శ్రేణులు కాగిత వారసుడుకే సీటు ఇస్తే గెలుస్తారని అంటున్నారు. పైగా జనసేనతో పొత్తు ఉంటే కలిసొస్తుందని చెబుతున్నారు. అలా కాకుండా సీటు మారిస్తే..ఇబ్బందులు తప్పవని అంటున్నారు. చూడాలి మరి చివరికి పెడన సీటు ఏం చేస్తారో.