పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వనని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశంలో ప్రతి సారి కొందరు ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తున్నారు. గడపగడపకు సరిగ్గా తిరగని ఎమ్మెల్యేకు ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు. తాజా సమావేశంలో 18 మంది అసలు గడపగడపకు వెళ్ళడం లేదని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడతానని, అక్టోబర్ వరకు సమయం ఇస్తానని ఈలోపు పనితీరు మెరుగు పడకపోతే సీటు ఇవ్వనని అన్నారు
జగన్ అధికారికంగా 18 మంది అని చెప్పారు గాని..దాదాపు 50 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, వారిపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తుంది. దీంతో వారిలో ఎంతమందికి జగన్ సీట్లు ఇవ్వరో చూడాలి. అదే సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సారి 5 గురికి సీట్లు ఇవ్వరని తెలుస్తుంది. 15 సీట్లు ఉన్న జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ 13 సీట్లు గెలుచుకుంది.
13లో 5 గురు పెద్దగా గడపగడపకు వెళ్ళడం లేదని, వారి పనితీరు కూడా బాగోలేదని తెలుస్తుంది. ఇదే సమయంలో టిడిపి, జనసేన పొత్తు ఉంటే వెస్ట్ లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కేలా లేదు. అందుకే పొత్తుగా తగ్గట్టుగా జగన్ కొన్ని చోట్ల బలమైన నేతలని రంగంలోకి దించాలని చూస్తున్నట్లు తెలిసింది.
భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ పనితీరు అంతంత మాత్రమే అని తెలుస్తుంది. ఈయన్ని మారుస్తారనే టాక్ నడుస్తుంది. అటు చింతలపూడి, గోపాలాపురం సీట్ల విషయంలో కూడా జగన్ మార్చాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇంకా ఒకటి , రెండు సీట్లలో మార్పులు తప్పవని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సారి వెస్ట్ లో ఎంతమంది సీట్లు గల్లంతు అవుతాయో.