జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ రోడ్ షో ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ స్థాయిలో సక్సెస్ అయింది. భారీగా జనం వచ్చారు. దీంతో ముమ్మిడివరంలో జనసేన విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే జనసేన ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించడం అనేది జరిగే పని కాదు. ఆ విషయం పవన్కు తెలుసు..అందుకే ముమ్మిడివరం సీటుపై పవన్ క్లారిటీ ఇవ్వలేదు.
అక్కడ ఇంచార్జ్ పితాని బాలకృష్ణని గెలిపించాలని పిలుపునివ్వలేదు. కానీ పవన్ ఇక్కడ పర్యటించారు కాబట్టి ఈ సీటు జనసేనకే అని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే పొత్తులో ఆ సీటుని టిడిపి తేలికగా వదులుకునే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ జనసేన కంటే టిడిపి బలం రెట్టింపు. దానికి ఉదాహరణ గత ఎన్నికల ఫలితాలు. గత ఎన్నికల్లో వైసీ అభ్యర్ధి పొన్నాడ సతీశ్కు 78 వేల ఓట్లు పడితే..టిడిపి అభ్యర్ధి దాట్ల సుబ్బరాజుకు దాదాపు 73 వేల ఓట్లు పడ్డాయి. ఇక జనసేన అభ్యర్ధి పితాని బాలకృష్ణకు 33 వేల ఓట్లు పడ్డాయి. వైసీపీ మెజారిటీ కేవలం 5 వేలే.
కాబట్టి టిడిపి బలం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాస్త కష్టపడితే టిడిపి గెలిచే ఛాన్స్ ఉంది. ఎలాగో ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత టిడిపికి కలిసి రావచ్చు. అటు సుబ్బరాజు కూడా నెక్స్ట్ తానే పోటీ చేస్తానని, ఈ సీటు తనదే అంటున్నారు. కానీ జనసేన నేతలు సైతం పట్టుబడుతున్నారు.
అయితే బలం లేకుండా ఈ సీటు జనసేన తీసుకుంటే టిడిపి ఓట్లు..జనసేనకు పూర్తి స్థాయిలో బదిలీ అవ్వడం కూడా కష్టమే. అదే జనసేన ఓట్లు కొంతమేర టిడిపికి బదిలీ అయిన చాలు గెలిచేస్తుంది. చూడాలి మరి ముమ్మిడివరం సీటు చివరికి ఎవరికి దక్కుతుందో.