నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకెళుతున్నారు. ఈ సారి జగన్ని గద్దె దించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వారాహి విజయ యాత్ర చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుతూ..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వైసీపీ వచ్చాక రాష్ట్రం నాలుగేళ్లలో ఎలా నాశనం అయిందో క్లియర్ గా చెబుతున్నారు. తక్షణమే జగన్ గద్దె దిగాలన్నట్లు పవన్ ఫైర్ అవుతున్నారు.
ఇక ఈ క్రమంలోనే తాజాగా అమలాపురం సభలో హలో ఏపీ..బై బై వైసీపీ అనే స్లోగన్ అందుకున్నారు. జనం బాగుండాలంటే..జగన్ పోవాలి అని అంటున్నారు. ఈ స్లోగన్లతో ముందుకెళ్లాలని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో జనసేన శ్రేణులు ఈ స్లోగన్లని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇక ఈ స్లోగన్లు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తాయనేది చూడాలి. అదే సమయంలో అటు టిడిపి సైతం సైకో పోవాలి..సైకిల్ రావాలి అంటూ స్లోగన్ ఎప్పటి నుంచో చెబుతుంది. దీనిపై ఒక పాట కూడా పెట్టింది.
ఇక ఈ స్లోగన్ జనంలోకి గట్టిగానే వెళ్లింది. గతంలో బై బై బాబు అంటూ వైసీపీ స్లోగన్ పెట్టుకుని 2019 ఎన్నికల్లో సక్సెస్ అయింది. ఇప్పుడు జగన్ని ఓడించడానికి టిడిపి సైకో పోవాలి..సైకిల్ రావాలి అనే స్లోగన్..పవన్ ఏమో హలో ఏపీ..బై బై వైసీపీ అనే స్లోగన్ పెట్టుకుంది. ఈ రెండు స్లోగన్లు బాగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ టిడిపి, జనసేన కలిస్తేనే వైసీపీకి ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఒకవేళ విడిగా పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చీలే ప్రమాదం ఉంది. అయితే ప్రజలు వన్ సైడ్ గా టిడిపి వైపుకు వస్తే ఓట్లు చీలిన ఇబ్బంది ఉండదు. చూడాలి మరి ఈ సారి ఎన్నికల్లో ఏం జరుగుతుందో.