తెలుగుదేశం పార్టీకి అసలు పట్టులేని స్థానాల్లో రంపచోడవరం కూడా ఒకటి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ స్థానంలో టిడిపి ఇంతవరకు గెలవలేదు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ స్థానంలో 2009లో కాంగ్రెస్ గెలిచింది. 2014లో వైసీపీ 8 వేల ఓట్ల తేడాతో గెలిచింది. వైసీపీ నుంచి వంతల రాజేశ్వరి గెలిచారు. గెలిచాక ఆమె టిడిపి వైపుకు వచ్చారు.
ఇక 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి రాజేశ్వరి, వైసీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి పోటీ చేశారు. వైసీపీ హవాలో ధనలక్ష్మి 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇంత మెజారిటీ రావడానికి కారణం టిడిపిపై వ్యతిరేకత, వైసీపీ వేవ్ ..అంతే తప్ప ధనలక్ష్మికి ప్రత్యేకంగా ఇమేజ్ లేదు. ఇప్పటికీ ఆమె ఎమ్మెల్యేగా సక్సెస్ కాలేదు. ఆమె మెరుగైన పనితీరు కనబర్చడం లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం..గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు తాగునీరు, రోడ్లు, ఆసుపత్రులు, స్కూల్స్ కూడా లేవు.
ప్రభుత్వం నుంచి పథకాలు మాత్రం వస్తున్నాయి. ఇవే ఆమెకు ప్లస్. అయినా సరే ఎమ్మెల్యేకు పాజిటివ్ లేదు. కానీ ఇటు టిడిపికి కూడా ప్లస్ లేదు. రాజేశ్వరి అనుకున్న మేర బలపడలేదు. పైగా గిరిజన ప్రాంతం కావడం, వైసీపీకి బలం ఎక్కువ ఉండటం, పథకాల వల్ల ఇప్పుడు కూడా అక్కడ వైసీపీకి ఆధిక్యం ఉంది.
అంటే ఇక్కడ వ్యక్తులతో సంబంధం లేదు. వైసీపీ నుంచి ఎవరు నిలబడిన గెలిచేలా ఉన్నారు. అయితే టిడిపి ఇంకా బలపడాలి. జనసేనకు ఇక్కడ బలం లేదు. ఇక పూర్తిగా టిడిపి వేవ్ వస్తేనే గాని ఇక్కడ గెలుస్తారు..లేదంటే గెలుపు కష్టమే.