విజయనగరం జిల్లా అంటే అశోక్ గజపతి రాజు, బొత్స సత్యనారాయణ రాజకీయ ఆధిక్యం ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. అశోక్ టిడిపి, బొత్స ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. దీంతో రెండు పార్టీలు పోటాపోటిగా ఉండేవి. ఇప్పుడు బొత్స వైసీపీలోకి వచ్చారు. దీంతో వైసీపీ హవా నడుస్తుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరంలో వైసీపీ 9కి 9 సీట్లు గెలవడానికి కారణం బొత్స అనే చెప్పాలి. ఆయన ఫ్యామిలీ, బంధువులే ఎమ్మెల్యేలుగా గెలిచారు.
ఇక బొత్స సోదరుడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరంలో విజయం సాధించారు. గతంలో ఈయన 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అప్పుడు 44 వేల ఓట్లు తెచ్చుకున్నారు. వైసీపీలోకి వచ్చాక..2019 ఎన్నికల్లో సత్తా చాటారు. టిడిపి నేత కొండపల్లి అప్పలనాయుడు పై 27 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా బొత్స సోదరుడు బాగానే పనిచేసుకుంటూ వెళుతున్నారు. కాకపోతే మొదట్లో ఉన్న దూకుడు ఇప్పుడు లేదు. పైగా అనేక అక్రమాల ఆరోపణలు వస్తున్నాయి. అటు అభివృధ్ది కూడా తక్కువే.
ఇదే సమయంలో టిడిపి నేత అప్పలనాయుడు దూకుడు పెంచారు. మళ్ళీ నియోజకవర్గంపై పట్టు సాధించే దిశగా వెళుతున్నారు. ఇక ఇటీవల సర్వేల్లో గజపతినగరంలో టిడిపి, వైసీపీలు హోరాహోరీగా ఉన్నాయని తేలింది. కాకపోతే స్వల్ప మెజారిటీ వైసీపీ వైపే ఉందని తేలింది. అయితే అప్పలనాయుడు ఇంకా కష్టపడాలి. పైగా ఈయనకు టిడిపిలో కొందరు నాయకులు పూర్తిగా సహకరించడం లేదు.
అందరినీ కలుపుకుని ఇంకా దూకుడుగా పనిచేస్తే నెక్స్ట్ ఎన్నికల్లో బొత్స సోదరుడుకు టిడిపి చెక్ పెట్టేస్తుంది.