తెలుగుదేశం పార్టీలో గెలుపు కోసం ఎదురుచూస్తున్న సీనియర్ నేతల్లో మీనాక్షి నాయుడు కూడా ఒకరు. వరుస ఓటములు ఎదురైన టిడిపిని వదలకుండా పోరాడుతున్నారు. 1994, 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచి సత్తా చాటిన మీనాక్షి నాయుడు..2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వై.సాయిప్రసాద్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక 2009లో మళ్ళీ నాయుడు గెలిచారు.
కానీ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. వైసీపీ నుంచి సాయిప్రసాద్ రెడ్డి గెలుస్తూ వచ్చారు. ఇక వరుసగా ఎమ్మెల్యే కావడంతో సహజంగానే ఎమ్మెల్యే సాయి పై వ్యతిరేకత ఉంది. అటు అధికారంలోకి వచ్చిన సరే ఆదోనిలో చేసిన అభివృద్ధి పెద్దగా లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. గడపగడపకు వెళితే ఎమ్మెల్యేకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఇలా అన్నీ రకాలుగా సాయిప్రసాద్కు పాజిటివ్ కనిపించడం లేదు. ఇక వరుస ఓటములతో నాయుడుపై సహజంగానే సానుభూతి ఉంది.
పైగా వయసు మీద పడుతుంది. దీంతో ఇవే చివరి ఎన్నికలు అన్నట్లు పోరాడుతున్నారు. లాస్ట్ ఛాన్స్ అన్నట్లు ఆదోని బరిలో నిలబడ్డారు. ప్రజలు కూడా కాస్త మార్పు కోరుకుంటున్నారు. ఈ సారి నాయుడుకు అవకాశం ఇవ్వాలని ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఆదోనిలో రెడ్డి వర్గం ప్రభావం వల్ల వైసీపీకి స్వల్ప లీడ్ కనిపిస్తుంది. కాకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చిన రెడ్డి వర్గానికి ఒరిగింది ఏమి లేదు.
దీంతో వారిలో కూడా మార్పు కనిపిస్తుంది. రెడ్డి వర్గాన్ని తన వైపుకు తిప్పుకుంటే ఈ సారి ఆదోనిలో మీనాక్షి నాయుడు విజయం ఖాయమే.