ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంకా కొన్ని సీట్లలో క్లారిటీ రావాల్సి ఉంది. పలు చోట్ల సీటు కోసం టిడిపి నేతల మధ్య పోటీ నెలకొంది. దీంతో సీట్ల విషయంలో చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రధానంగా శింగనమల సీటు విషయం పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది. ఇక్కడ టిడిపి ఇంచార్జ్ గా బండారు శ్రావణి ఉన్నారు. ఆమె కొన్ని రోజులు యాక్టివ్ గా పనిచేస్తుంటే..మరికొన్ని రోజులు చేయడం లేదు. ఎందుకంటే అనంతలోని కొందరు సీనియర్లు ఆమెకు చెక్ పెట్టడానికి చూస్తున్నారు.
దీంతో శ్రావణి సైలెంట్ అయిపోతున్నారు. అయితే ఆ మధ్య లోకేష్ పాదయాత్ర సమయంలో ఆమె యాక్టివ్ గానే తిరిగారు. ఇటీవల కాస్త సైలెంట్ అయ్యారు. అంటే సీటు ఆమెకు ఖచ్చితంగా దక్కుతుందనే గ్యారెంటీ లేకుండా పోయింది. శ్రావణి..జేసి వర్గం కావడంతో కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి వర్గాలు..శ్రావణిని వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గంలో ఆమెకు సహకరించడం లేదు. అటు ఎస్సీ సెల్ నేత ఎంఎస్ రాజు సైతం సీటు ఆశిస్తున్నారు.
గత ఎన్నికల్లోనే సీటు ఆశించారు. కానీ జేసి ఫ్యామిలీ సపోర్ట్ తో శ్రావణి శింగనమల సీటు దక్కించుకుంది. కానీ వైసీపీ వేవ్ లో ఓడిపోయారు. అటు వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి పాజిటివ్ పెద్దగా లేదు. ఆమె ఫ్యామిలీ అక్రమాలు చేస్తుందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇవే ఎమ్మెల్యేకు మైనస్.
కానీ టిడిపిలో సీటు ఎవరికో తెలియకపోవడం మైనస్. ఒకవేళ శ్రావణికి సీటు ఫిక్స్ చేస్తే ఆమెకు టిడిపిలోని మరో వర్గం ఎంతవరకు సహకరిస్తుందో చెప్పలేం. మరి చూడాలి శింగనమల శ్రావణికే ఫిక్స్ చేస్తారా? లేక కొత్త అభ్యర్ధిని పెడతారా?