దొంగే..దొంగ దొంగ అన్నట్లుగా ఉంది..వైసీపీ రాజకీయం. కుట్రలు చేస్తూ, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి టిడిపిని దెబ్బతీస్తూ..రాజకీయంగా లబ్ది పొందడానికి ప్రయత్నించే వైసీపీ..అధికార బలంతో టిడిపిపై ఎన్నిరకాలుగా దాడులు చేస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ఇక చంద్రబాబుకు సొంత జిల్లాలో కూడా స్వేచ్ఛగా తిరిగే ఛాన్స్ లేకుండా పోతుంది.
ఒక ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబుకు రాష్ట్రంలో ఎక్కడకైనా వెళ్ళే హక్కు ఉంది. ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడే హక్కు ఉంది. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు ఏ స్థాయిలో నిర్లక్ష్యానికి గురయ్యాయో అనే అంశాన్ని ప్రజలకు వివరించడానికి బాబు ప్రాజెక్టుల బాటపట్టారు. అలాగే రోడ్ షోలు, భారీ సభలకు ప్లాన్ చేశారు. ఊహించని విధంగా నందికొట్కూరు, పులివెందుల, కదిరి సభలు సక్సెస్ అయ్యాయి. రోడ్ షోలకు భారీగా జనం వస్తున్నారు. ఇదే క్రమంలో తన సొంత జిల్లా చిత్తూరు పర్యటన పెట్టుకున్నారు.
అయితే బాబు పర్యటన తంబళ్ళపల్లె, పుంగనూరులు మీదుగా పూతలపట్టు వరకు సాగాలి. యథావిధిగా వెళ్లిపోతే ఇబ్బంది ఉండేది కాదు. ఎక్కడ బాబు రోడ్ షో భారీ హిట్ అవుతాయని చెప్పి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు తంబళ్ళపల్లె, పుంగనూరుల్లో అడ్డుకోవాలని చూశాయి. పోలీసులు సైతం వైసీపీకే అండగా ఉన్నారనే విమర్శలు వచ్చాయి. కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన బాబు టూర్ బంపర్ హిట్ అయింది. ఇలా హిట్ అవ్వడానికి 5 అదిరిపోయే కారణాలు ఉన్నాయి.
మొదట అంగళ్ళులో వైసీపీ శ్రేణులు బాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడి చేశాయి. కానీ అక్కడే టిడిపి శ్రేణులు రివర్స్ అయ్యి..వైసీపీ శ్రేణులని తరిమికొట్టారు. నెక్స్ట్ పుంగనూరు టౌన్లోకి వెళ్లకుండా పోలీసులు..టిడిపి శ్రేణులని అడ్డుకున్నాయి..లాఠీ చార్జ్ చేశారు. కానీ టిడిపి శ్రేణులు ఎదురుతిరిగాయి. పోలీసులని కూడా సమర్ధవంతంగా ఎదురుకున్నారు. ఇక బాబు సైతం సమన్వయం అంటూ కార్యకర్తలని ఆపలేదు..వైసీపీ వాళ్ళు కర్రలతో వస్తే మన వాళ్ళు కర్రలు పట్టుకోవాలని అన్నారు. దీంతో టిడిపి శ్రేణులు..వైసీపీ వారికి ఉరికించారు.
నెక్స్ట్ వైసీపీ చేసిన రాజకీయాన్ని ప్రజలు అసహ్యించుకునే పరిస్తితి వచ్చింది. ఇలా దాడులు చేయడంతో పూతలపట్టు సభలో భారీ స్థాయిలో జనం వచ్చారు. అలాగే ఆద్యంతం బాబు అదిరిపోయే స్పీచ్లతో అదరగొట్టారు. ఈ పరిణామాలు మొత్తం చిత్తూరులో వైసీపీ ఎంత కుట్ర చేసిన…బాబు పర్యటన సూపర్ హిట్ అయింది..టిడిపికి జోష్ వచ్చింది.