పుంగనూరు-తంబళ్ళపల్లె నియోజకవర్గాలు రాజకీయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఉన్న స్థానాలు. ఈ స్థానాల్లో వైసీపీకి తప్ప మరొక పార్టీకి గెలిచే అవకాశాలు లేవనే పరిస్తితులు. అయితే ఇదంతా మొన్నటివరకు..ఇప్పుడు సీన్ మారుతుంది. అక్కడ పెద్దిరెడ్డి చేసే రాజకీయమే వైసీపీని దెబ్బకొట్టేలా ఉంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంతో సహ చిత్తూరులోని అన్నీ స్థానాల్లో టిడిపిని అణిచివేసే దిశగా రాజకీయం నడిపించారు.
ఒకానొక దశలో పుంగనూరులో స్థానిక ఎన్నికలకు టిడిపి వాళ్ళని నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. ఎడాపెడా దాడులు జరిగాయి. ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్తితులే టిడిపి శ్రేణులని ఇంకా కసిగా పనిచేసేలా చేశాయి. అందుకే వైసీపీ దాడులు చేస్తే చూస్తూ ఊరుకోలేదు..తమ్ముళ్ళు తిరగబడ్డారు. ఈ అంశమే టిడిపిని బలపడేలా చేశాయి. అటు చంద్రబాబు కూడా జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఇక మొన్న వై నాట్ పులివెందుల అన్న బాబు..ఇప్పుడు వై నాట్ పుంగనూరు అంటున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానని సవాల్ చేశారు.
తాజా పరిణామాలతో పుంగనూరు, తంబళ్ళపల్లెలో టిడిపికి ప్రజా మద్ధతు పెరిగింది. వైసీపీని గెలిపిస్తే దాడులు, అక్రమాలు తప్ప మరొకటి ఉండటం లేదనే భావన ప్రజల్లో కనిపిస్తుంది. పుంగనూరులో పెద్దిరెడ్డికి, తంబళ్ళపల్లెలో పెద్దిరెడ్డి సోదరుడుకు ప్రజలే చెక్ పెడతారని తెలుగు తమ్ముళ్ళు స్ట్రాంగ్ గా చెబుతున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో తంబళ్ళపల్లెలో వైసీపీకి ధీటుగా టిడిపి ఉంది. కాకపోతే పుంగనూరులో టిడిపి ఇంకా బలపడాలి. పెద్దిరెడ్డిని ఎదురుకోవడం ఈజీ కాదు. ఎలాగైనా మళ్ళీ గెలవడానికి పెద్దిరెడ్డి ఎలాంటి రాజకీయమైన చేస్తారు. కాబట్టి టిడిపి నేతలు అలెర్ట్ గా ఉంటూ పనిచేస్తూ..పార్టీని మరింత బలోపేతం చేస్తే..తంబళ్ళపల్లె కాదు..పుంగనూరు కూడా టిడిపి వశమే.