అనంతపురం అసెంబ్లీ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట..తరిమెల నాగిరెడ్డి సత్తా చాటిన నియోజకవర్గం..అలాగే మధ్య మధ్యలో కాంగ్రెస్ కూడా గెలిచింది. కానీ ఎన్టీఆర్ రాకతో సీన్ మారింది. అనంతలో టిడిపి హవా మొదలైంది. 1983, 1985 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. 1989లో కాంగ్రెస్ గెలవగా, 1994లో కమ్యూనిస్టులు, 1999, 2004లో కాంగ్రెస్ హవా నడిచింది.
ఇక 2008 లో అనంతపురం అర్బన్ సీటుగా మారగా..2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం టిడిపికి మైనస్ అయింది. అయితే 2014లో మళ్ళీ టిడిపి సత్తా చాటింది. జనసేనకు సపోర్ట్ కూడా ఉండటంతో టిడిపి గెలిచింది. టిడిపి నుంచి ప్రభాకర్ చౌదరీ గెలిచారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో బాగానే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ 2019లో జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. పైగా జనసేన విడిగా పోటీ చేయడం మైనస్ అయింది. దీంతో వైసీపీ నుంచి అనంత వెంకట్రామి రెడ్డి గెలిచారు. గతంలో ఈయన కాంగ్రెస్ నుంచి అనంత ఎంపీగా గెలిచారు.
వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వైసీపీ హయంలో అనుకున్న మేర అభివృద్ధి లేదు..అటు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది. అలాగే టిడిపి బలపడుతుంది. ఈ క్రమంలో ఈ సారి అనంతలో టిడిపి, వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగేలా ఉంది. ఇక పొత్తులు ఉంటే సమీకరణాలు మారతాయి. జనసేనతో పొత్తు ఉంటే..ఆ పార్టీ ఈ సీటు డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది.
కానీ టిడిపి వదులుకునే అవకాశాలు తక్కువే. అయితే టిడిపి-జనసేన కలిస్తే అర్బన్ లో పై చేయి సాధించవచ్చు. వైసీపీకి చెక్ పెట్టవచ్చు.