జగన్ ప్రతి సభలోనూ తాను పేదల కోసం పనిచేస్తున్నానని, పేదల కోసం పనిచేస్తున్న తనపై చంద్రబాబు, పవన్ కుట్రలు చేస్తున్నారని, తాను ఒంటరి అని, ప్రజలే అండగా ఉండాలని, తనకు ఆర్ధిక, అంగ బలం లేదని, మీడియా సపోర్ట్ లేదని చెబుతూ ఉంటారు. అయితే నిజనిజాలు ఏంటి అనేది ప్రజలకు బాగా తెలుసు. ఆయన దేశంలో అత్యంత ధనవంతుడైన సిఎం అనే సంగతి తెలిసిందే. ఇక ఆయనకు మీడియా సపోర్ట్ ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పని లేదు. ఆర్ధిక, అంగ బలం గురించి చెప్పాల్సిన పని లేదు.
అయినా సరే ప్రతి సారి జగన్ అవే స్పీచ్లు పేదలకు, పెత్తందార్లకు యుద్ధమని అంటారు. ఆశలు పెత్తందార్లు ఎటు వైపు ఉన్నారో అందరికీ తెలిసిందే. కానీ ఆయన స్పీచ్లు రాసేవారు స్క్రిప్ట్ మార్చడం లేదు. అదే పాత స్పీచ్లు. ఇలా పదే పదే పేదల మనిషి అని జగన్ చెప్పుకుంటున్నారు.ఇక జగన్ పేదరికం కామెంట్లకు టిడిపి సీనియర్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ వచ్చారు.
మొదట అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి..ఇళ్ళు కట్టి ఇస్తుంటే టిడిపి అడ్డుకుంటుందని జగన్ విమర్శలు చేసిన దానికి గంటా కౌంటర్ ఇస్తూ.. “అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో కోర్టు తుది ఉత్తర్వులు వెల్లడించకుండానే మీరు ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడమనేది నిరుపేదల జీవితాలతో ఆడుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వేళ రేపు తుది తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆ సెంటు భూమిలో ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత వహిస్తారు.” అని అన్నారు. ఇక రైతుల ప్రాథమిక హక్కులను కాలరాస్థూ రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం , పేదల సంక్షేమం ముసుగులో అమరావతి మాస్టర్ ప్లాన్ను ధ్వంసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
అలాగే ‘‘ఒక పక్క… మీ స్వార్ధపూరిత రాజకీయ జిత్తులకు అమాయకమైన నిరుపేదలను బలిచేస్తూ. మరోపక్క…. నేను పేదల పక్షాన పోరాడుతున్నాను, రాష్ట్రంలో పేదలకు పెట్టుబడిదారులకు మధ్య వర్గపోరు నడుస్తోందంటూ.. దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్న మీరు చెప్పడం ఈతరానికి అతి పెద్ద పొలిటికల్ జోక్ జగన్ గారు…..!. ప్రతి మీటింగ్లో ప్రతి సారి నేను ఒక నిరుపేదని, నాకు అంగబలం లేదు, నాకు ఆర్థిక బలం లేదు, నాకు మీడియా బలం లేదు, నాకు మోసం చేయడం తెలియదు, నాకు నక్కజిత్తులు తెలియవు, నేను ఒక అమాయకుడుననే పేదరికపు హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారు. ప్రజలేమి అమాయకులు కాదు జగన్ గారు. తెలిసో, తెలియకో… 2019లో “ఒక్క అవకాశం” మాయలో పడి కోలుకోలేని అతి పెద్ద తప్పు చేశారనేది తెలుసుకున్నారు. విముక్తి కోసం అదే ప్రజలు ఎప్పుడు ఎప్పుడా అని 2024 కోసం ఎదురు చూస్తున్నారు’’” అంటూ గంటా ఫైర్ అవుతూ ట్వీట్ చేశారు. గంటా చేసిన ట్వీట్లు వాస్తవ పరిస్తితులకు అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు.