ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టిడిపి కంచుకోట స్థానాల్లో కొండపి కూడా ఒకటి. ఇక్కడ టిడిపి అయిదుసార్లు గెలిచింది. అయితే 2009 ముందు వరకు జనరల్ స్థానంగా ఉండేది. తర్వాత ఎస్సీ రిజర్వడ్ సీటు చేశారు. ఎందుకంటే ఇక్కడ కమ్మ వర్గం ఓట్లు ఎక్కువ. అందుకే టిడిపిని దెబ్బకొట్టడం కోసం ఎస్సీ ఓటర్లు ఎక్కువ ఉన్న మండలాలని కలిపి కొండపిని ఎస్సీ రిజర్వడ్ చేశారు.
ఆ ప్రభావంతో 2009 ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ 5 వేల ఓట్ల మెజారిటీతో టిడిపిపై గెలిచింది. కానీ 2014 నుంచి సీన్ మారిపోయింది. అప్పుడు టిడిపి నుంచి డోలా బాలవీరాంజనేయ స్వామి గెలిచారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు స్వామి..కొండపిలో అభివృద్ధి పనులు చేశారు. అందుకే 2019లో జగన్ గాలిలో కూడా గెలిచారు. ఇక ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని స్వామి చూస్తున్నారు. అయితే స్వామిపై బలమైన ప్రత్యర్ధి దొరకడం లేదు.
2014లో జూపూడి ప్రభాకర్ రావుని నిలబెట్టారు. 2019లో మాదాసి వెంకయ్యని నిలబెట్టి విఫలమయ్యారు. ఎన్నికల తర్వాత వరికూటి అశోక్ బాబుని ఇంచార్జ్ గా పెట్టారు. ఇక అశోక్, వెంకయ్య వర్గాలకు పడటం లేదు. నిత్యం రచ్చ నడుస్తుంది. అందుకే మళ్ళీ కొత్త అభ్యర్ధిపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఎలాగో అశోక్ ఇంచార్జ్ గా ఫెయిల్ అయ్యారు. ఆయన్ని సైడ్ చేసి..మళ్ళీ మాదాసి వెంకయ్య లేదా తాడిపర్తి చంద్రశేఖర్ పేర్లు పరిశీలిస్తున్నారట. అయితే వెంకయ్యకు ఒకసారి అవకాశం ఇచ్చారు. దీంతో చంద్రశేఖర్ వైపు చూస్తున్నారట. ఆయన స్థానికుడు కావడం.. ఆర్థికంగా కూడా స్థితిమంతుడు కావడంతో కొత్త ఇన్చార్జిగా నియమించే చాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఎవరిని నిలబెట్టిన కొండపిలో స్వామికే ఆధిక్యం కనిపిస్తుంది. ఇక్కడ కమ్మ వర్గం హవా ఎక్కువ. అటు సగం ఎస్సీ ఓటర్ల సపోర్ట్ ఉంది. దీంతో కొండపిలో మళ్ళీ స్వామి విజయం ఖాయమే.