తెలుగుదేశం అంటే బీసీల పార్టీ..అందులో ఎలాంటి డౌట్ లేదు. టిడిపి ఆవిర్భావం నుంచి రాజకీయంగా , సామాజికంగా బిసిలకు పెద్ద పీఠ వేసింది ఎన్టీఆర్. ఆయన చొరవతోనే బిసిలకు రిజర్వేషన్లు పెరిగాయి…రాజకీయాల్లో బిసిల నుంచి గొప్ప నాయకులు వచ్చారు. బిసిలకు రాజ్యాధికారం దక్కింది. అందుకే మొదట నుంచి బిసిలు టిడిపికి అండగా ఉంటూ వచ్చారు. అయితే టిడిపి నుంచి బిసిలని వేరు చేయడానికి ప్రత్యర్ధులు అనే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలో 2014లో అధికారంలో ఉన్న టిడిపిని దెబ్బతీయడానికి వైసీపీ ఎలాంటి ఫేక్ పాలిటిక్స్ చేసిందో చెప్పాల్సిన పని లేదు. టిడిపిని ఒక కులానికి అంటగట్టి చేసిన చిత్రాలు అన్నీ ఇన్ని కాదు. టిడిపిని కమ్మ పార్టీ అని ముద్ర వేసింది. కానీ టిడిపిలో అన్నీ వర్గాలకు న్యాయం జరుగుతుంది. అయితే వైసీపీ చేసిన ఫేక్ రాజకీయం వర్కౌట్ అయింది. 2019 ఎన్నికల్లో బిసిలు మెజారిటీ సంఖ్యలో వైసీపీ వైపు నిలిచారు. దీంతో వైసీపీ భారీగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.
అలా అధికారంలోకి వచ్చిన వైసీపీ..బిసిలకు ఒరగబెట్టింది ఏమి లేదు. ఏదో మొక్కుబడిగా కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు..కానీ వాటికి నిధులు ఇవ్వలేదు. బిసిలకు ఉపయోగం లేదు. అందరికీ వచ్చినట్లే అర్హులైన వారికి పథకాలు మాత్రం వస్తున్నాయి. ఇక విలువైన పదవులు రెడ్లకు, ఏదో అధికారాలు లేని పదవులు బిసిలకు ఇచ్చారు. అలా చేసి తాము ఏదో బిసిలకు చేసేశామని చెప్పుకున్నారు. అలాగే వైసీపీ పాలనలో బిసిలపై దాడులు ఎక్కువ అయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో బిసిల్లో మళ్ళీ మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు..మినీ మేనిఫెస్టోలో ఎస్సీ-ఎస్టీ చట్టం మాదిరిగానే బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తాజాగా లోకేష్ జయహో బిసి సభ ఏర్పాటు చేసి బిసిలకు కీలక హామీలు ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, కుల వృత్తుల వారికి ఆర్ధికంగా అండగా ఉంటామని, బిసిలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రం ఇస్తామని, ఇలా ప్రతి బిసిల్లో ఉన్న ప్రతి కులానికి హామీ ఇచ్చారు. ఈ పరిణామాలు మళ్ళీ బిసిలని టిడిపి వైపుకు తిప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మెజారిటీ బిసిలు మళ్ళీ టిడిపికే మద్ధతు తెలుపుతారు.