వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేశారు. ఆ యాత్ర ఫలితంగా 2019 ఎన్నికల్లో ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు అన్నది జగమెరిగిన సత్యం. మిగ్ జాం తుపాను వలన అన్నదాతలు చాలా నష్టపోయారు. రైతులంతా సహాయ కార్యక్రమాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ జగన్ ఏదో ఫోటో షూట్ కోసం వచ్చినట్లు వ్యవహరించటం సామాన్యుల తోపాటు పార్టీ క్యాడర్ కూడా తలలు పట్టుకుంటున్నారు. మిగ్ జాం తుఫాన్ వలన నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. పరామర్శించారు కానీ పరామర్శించినది అసలు రైతులను కాదు పంట నష్టాన్ని అంచనా వేసినది లేదు. పొలాలలో దిగకుండా, కాలికి మట్టి అంటకుండా, చేతికి ధాన్యం నాణ్యత తెలియకుండా ఓదార్పు యాత్రచేశారు ఈ యాత్రలు కష్టాలు చెప్పుకుందామని అనేకమంది రైతులు జగన్మోహన్ రెడ్డి వద్దకు వచ్చారు. కానీ వారెవరిని ముఖ్యమంత్రిని కలవనివ్వకుండా భారీగా ఏర్పాటు చేశారు. రెడ్ కార్పెట్ పలికి స్వాగతం పలికారు. అధికారులు ముందుగా ట్రైనింగ్ ఇచ్చిన రైతుల మాత్రమే మాట్లాడించారు. వారంతా ప్రభుత్వ తీరు బాగుందని సహాయక చర్యలు అందాయని తామంతా సంతోషంగా ఉన్నాయని చెబుతుంటే ముఖ్యమంత్రి తరహాలో ఉన్న వ్యక్తి ఇలా కాదు ప్రవర్తించాల్సింది కాదు అంటూ రైతులతో పాటు వైసిపి క్యాడర్ కూడా తలలు పట్టుకుంటున్నారు.
ఇదే నష్టం కనుక చంద్రబాబు నాయుడు టైంలో జరిగి ఉంటే రక్షణ కార్యక్రమాల కోసం తక్షణ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ప్రజలలో ఉంటూ వారికి సహాయ కార్యక్రమాల ఎలా జరుగుతున్నాయో అని ప్రజలకు నిత్యవసరాలు అందుతున్నాయో లేదోఅని ప్రతి ఒక్కరికి వరద నీటిలో సైతం ప్రజలకు తోడుగా ఉండే వారిని తమకు కావాల్సింది. అటువంటి ముఖ్య మంత్రిని ఇలా ఫోటోలు కోసం పనిచేసే ముఖ్యమంత్రి బహిరంగంగానే విమర్శిస్తున్నారు ఇప్పటికైనా జగన్ తీరు మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు