చంద్రబాబు నాయుడు మిగ్ జాం తుఫాను బాధితులను పరామర్శించడానికి బాపట్ల, గుంటూరు జిల్లాలలో పర్యటించారు. తుఫాన్ వలన తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. తుఫాను గురించి ఈ ప్రభుత్వం ముందుగా హెచ్చరించి ఉంటే ఇంత నష్టం చేకూరేది కాదని, తుఫాను వలన నష్టం జరిగిన తర్వాత కూడా సహాయక చర్యలు ప్రారంభించలేదు అని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఇసుక మట్టి దోచుకోవడానికి ఉన్న శ్రద్ధ ప్రజలను కాపాడడానికి లేదని విమర్శించారు.
గుంటూరులో ఉన్న డ్రైన్ల పూడిక తీయకుండా వదిలివేసారని, వాటి కోసం ఇచ్చిన నిధులను ఆపివేశారని చంద్రబాబు విమర్శించారు. ఆ డ్రైన్ల పూడిక తీసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని తెలిపారు. ఈ అరాచక పాలనకు స్వస్తి పలకాలంటే ఈసారి టిడిపి జనసేన కూటమి కచ్చితంగా రావాలని ప్రజలకు గుర్తు చేశారు. కూటమి వస్తే నియోజకవర్గం లో ఉన్న అన్ని సమస్యలను పూర్తి చేస్తామని, యుద్ధ ప్రాతిపదికన డ్రైన్ల తీస్తారని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఐదేళ్లుగా ఆగిపోయిన యానాదుల కాలనీ నిర్మాణాన్ని చేపడతానని, వారికి ఒక్కో ఇంటికి 5000 రూపాయల తో పాటు నిత్యావసర వస్తువుల కిట్లు అందజేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి పక్కా ఇళ్లతో మౌలిక వసతులతో కూడిన పక్కా ఇల్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
ఆ పర్యటనలో రైతులు అందరూ చంద్రబాబు నాయుడుని దేవుడే తమకు తోడుగా పంపరనితెలిపరు. అధికార ప్రభుత్వం పట్టించుకోకపోయినా అండగా ఉన్న చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు..