దివంగత కోడెల శివప్రసాద్ కంచుకోట అంటే నరసారావుపేట ఠక్కున గుర్తొస్తుంది. అక్కడ కోడెల అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983 నుంచి 1999 వరకు సత్తా చాటారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో పేట వదిలి సత్తెనపల్లి వెళ్ళి గెలిచారు. అయితే కోడెల వదలడమే పేటలో టిడిపికి మైనస్ అయింది. 2014లో పొత్తులో భాగంగా ఈ సీటు బిజేపికి ఇవ్వడంతో వైసీపీ గెలుపు సులువైంది. వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు.
ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉంది..దీంతో టిడిపి డైరక్ట్ బరిలో దిగిన వైసీపీ గెలుపు ఆగలేదు. మళ్ళీ గోపిరెడ్డి గెలిచారు. టిడిపి నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేసి ఓడిపోయారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఎఫెక్టివ్ గా పనిచేయకపోవడం..పలు వివాదాలు..అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మైనస్ అయ్యాయి. అలాగే సొంత పార్టీ వాళ్లే గోపిరెడ్డికి యాంటీగా ఉన్నారు.
అటు కాసు కృష్ణమూర్తి వర్గం సైతం గోపిరెడ్డికి వ్యతిరేకంగా ఉంది. ఈ పరిణామాలు టిడిపికి ప్లస్..కానీ అరవింద్ బాబు సాఫ్ట్ గా ఉండటం…దూకుడుగా రాజకీయం చేయకపోవడం మైనస్. మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాదిరిగా దూకుడు ఉంటే ఇక్కడ టిడిపి గెలుపు ఖాయం చేసుకోవచ్చు. కానీ అరవింద్ బాబు అలా లేరు. అదే టిడిపికి పెద్ద మైనస్.
ఈ క్రమంలో అభ్యర్ధిని మార్చాలనే డిమాండ్ వస్తుంది. పేటలో కమ్మ, రెడ్డి వర్గాలు రాజకీయంగా బలమైనవి. ఆ రెండు వర్గాల్లో ఎవరోకరిని బరిలో దింపాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి. ఒకవేళ అక్కడ టిడిపికి బలమైన అభ్యర్ధి ఉంటే డౌట్ లేకుండా గెలిచేయవచ్చని అంటున్నారు. మరి పేట అభ్యర్ధి విషయంలో బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.