నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్..టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన శాఖలకు మంత్రిగా చేసి త్వరితకాలంలోనే ప్రజలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. చంద్రబాబు వారసుడిగా తప్ప లోకేష్ కి ఎటువంటి ప్రత్యేకత లేదు అని అందరూ అనుకుంటున్న తరుణంలో వారి అంచనాలను తారుమారు చేస్తూ లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించి అధికార పార్టీలోని తప్పులను వేలెత్తి చూపిస్తూ తమ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేస్తామో చెబుతూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్విఘ్నంగా తన యాత్రను కొనసాగిస్తున్నారు.
తాత ఎన్టీఆర్ లోని దాతృత్వ భావనను దానగుణాన్ని మాట ఇస్తే తప్పని తత్వాన్ని పునికి పుచ్చుకున్న లోకేష్ తన పాదయాత్రలో సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు. లోకేష్ లోని సహృదయత తన చాటి చెప్పే సంఘటనలు యువగళం పాదయాత్రలో కోకొల్లలు అందులోని ఒక సంఘటన….
ఉమ్మడి కర్నూలు జిల్లా..బండిఆత్మకూరు పార్లపల్లెలో యువగళం పాదయాత్ర లో భాగంగా లోకేషన్న ఓ నిరుపేద ముస్లిం అవ్వని కలిసాడు,కుటుంబం కోసం పంచర్లు కొట్టు నడుపుకుంటున్న ఆ అవ్వను చూసి చలించిన లోకేష్ బాబు ‘అమ్మా నీ పేరు ఏం పేరు, ఈ వయసులో నీకు కష్టం ఏంటి తల్లి..?’అని అడిగాడు. అప్పుడు ఆ అవ్వ బాబు నా పేరు “షేక్ హుసేన్ బేగ్”పిల్లలు కి భారం కాకుడదని, వృద్ధుడైన భర్తను సాకడం కోసం ఈ పని చేసుకుంటున్న అని చెప్పింది. అన్నీ అవయవాలు బాగా ఉండి సోమరితనం కు అలవాటు పడిన వారి కంటే ఆ వృద్దురాలి కష్టాన్ని చూసి చలించిపోయాడు. అవ్వా నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పు నేను తీరుస్తా అని అనగానే..అవ్వ ఎంత కాయా కష్టం చేసినా తన కోరిక(హజ్ యాత్ర ప్రయాణం)తీరట లేదని లోకేష్ బాబు దగ్గర వాపోయింది. నీ కోరిక నేను తీరుస్తూ తల్లి అని మాట ఇచ్చాడు. హజ్ యాత్రకి టైం అని తెలుసుకుని 1,50,000 వేలు శ్రీశైలం టిడిపి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఇచ్చి హుసేన్ బేగ్ కి అందచేసాడు లోకేష్.
డబ్బు అందుకున్న హుసేన్ బేగ్ హర్షం వ్యక్తం చేస్తూ తన చిరకాల కోరిక తీర్చిన లోకేషన్న ఆ అల్లా ఆశీస్సులతో పాదయత్ర జయప్రదం అవుతుందని దీవించింది. చూశారా లోకేష్ లోని మంచితనం మాట తప్పని తత్వం. లోకేష్ మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తారు అని పార్టీ అభిమానులు ప్రజలు చెప్పుకుంటున్నారు..
ReplyReply allForward |